ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Showing posts with label మున్నుడి. Show all posts
Showing posts with label మున్నుడి. Show all posts

Monday, January 8, 2018

మధ్యతరగతి జీవన విలువల అస్తిత్వ కథా విహారి



S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన అన్నట్లు, ‘కథకులందు పుణ్యకథకులు వేరయా’ అనాలనిపిస్తుంది ‘మనవే’ అనిపించే విహారి కథలు చదివినప్పుడు. మానవీయ విలువల మహిత సంపదను మూటగట్టిన నిధులు వారి కథలు. విహారి కథల్లో -
విలక్షణత వుంది,
హాయిగా చదివించే పఠనీయత వుంది,
రిరంసవాటిల్లోది ప్రధానంగా జీవన మూల్యాలది.

రెండు ఏడుల వయసులో అడుగిడిన విహారి అర్ధశతాబ్దంపైగా కథారచనా విహారం చేస్తున్నారు. బ్రతుకు తాత్త్వికతనే జీవనాడిగా చేసుకున్న ఆయన కలం మనిషి ‘చలనం’ను ‘స్పృహ’లో ఉంచుకుని, జీవితపు ‘ఎత్తుపల్లాలు’ ‘సహజాతాలు’గా చిత్రించింది. కథారచనా వైశిష్ట్యంలో ఆయనను ఒక ‘శిఖరంమీద’ నిలబెట్టింది. ఆయన ‘అక్షరం’, అభివ్యక్తి ‘వలయం’ పాఠకుడు ఇది విహారి రచన అని ‘పోల్చుకోగల రాతే’.
యాభై ఏళ్ళ కథారచనా ప్రయాణంలోని పాతిక ప్రాతినిధ్య కథలతో నవచేతన ప్రచురణగా విడుదల చేసిన విహారి కథలు చదువుతూంటే ఈ విలక్షణ పుణ్య కథకునికి దక్కవలసిన విశిష్ట గౌరవం ఇంకా సశేషంగానే ఉందనిపిస్తుంది. 

ఇప్పటికి పధ్నాలుగు కథా సంపుటాలు విహారివి వెలువడ్డాయి. స్పృహ, గోరంత దీపం, అక్షరం, అమ్మ పేరు చీకటి, గుండెలో కోయిల, బొంగరం, కొత్తనీరు, ప్రాప్తం, చిరంజీవి ఆశ, వౌనలిపి, ‘వి’గతం, కిటికీ తెరిస్తే, మాయతెర, విహారి కథలు అనే ఈ కథానికల సంపుటులలోని కథలన్నీ క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులవలె పరివర్తనాశీలమైన మానవ జీవన వైఖరులకు ప్రతిబింబితాలుగా వున్నాయి. ఇంత విస్తృతితో, విలక్షణతతో, వైవిధ్యంతో కథలు రాసినవారు అరుదు. రాసిన ప్రతి కథా నాటి సమకాలీనతను సంతరించుకోవడం మాత్రమే కాక ఒక సార్వజనీనతా లక్షణాన్ని కూడా పొదుపుకోవడం విశేషం. విహారి కథలు పాఠకులను ఊహాల్లోకాల్లో తేలియాడించవు. భ్రమలలోకి నెట్టవు. అవాస్తవికతను ఆపాదించవు. జీవితం ఏది ఎప్పుడు ఇస్తుందో అప్పుడు దానిని స్వీకరించడమనే నేల విడచి సాము చేయని జీవన పథాన్ని నిర్దేశించి ముందుకు నడిపిస్తాయి. హేతువును, తార్కికతను విస్మరించకుండానే సమ్యక్ దృష్టిని కలిగించే స్థితప్రజ్ఞతవైపు పఠితను మేల్కొల్పుతాయి. ఆయన రచనా శైలి గొప్పది. భాషపట్ల మంచి పట్టుంది. వ్యక్తులను, సమాజాన్నీ నిశితంగా పరిశీలించడంలో నిష్ణాతులు. అందుకే ఆయన కథల్లోని సంఘటనలు గానీ, పాత్రలుగానీ, ఆ పాత్రల సంభాషణలు గానీ ఏవీ కృతకంగా వుండవు. సహజత్వం తొణికిసలాడుతూంటుంది. ఆయన కథల్లో ప్రయోగాలు ఎన్ని చేసినా అవి చెప్పదలుచుకున్న విషయానికి ప్రోద్బలంగానూ, పాఠకానుభవానికి సహాయకారిగానూ వుంటాయి తప్పితే ప్రయోగం కోసం ప్రయోగం అన్నట్లుండవు.

విహారి కథల్లోని మరో గుర్తించదగిన కోణం ఏమిటంటే ఆయన కథలు ‘మధ్యతరగతి’ వర్గ సమాజానికి చెందినవి. ‘‘అందరూ ఆడిపోసుకునే మధ్య తరగతి మందహాసాల వెనుక దాగిన సింబల్స్‌ని, ప్రతీకలని ఔపోసన పట్టిన కథకుడు విహారి’’ అని మునిపల్లె రాజుగారన్నా, ‘‘మధ్యతరగతిని ఒక ఇంటిపేరుగా తీసుకుని తెలుగు సమాజానికి కొత్తగా పరిచయం చేస్తారు విహారి. అవసరానికి ఆదుకునే బంధువులు, ఇంటిమొత్తానికి ఒకడే సంపాదనాపరుడిగా ఉండటం, ఆచారాలు- సంప్రదాయాల పేరిట ఆదాయాన్ని మించి ఖర్చులు పెట్టడం, అనవసర ఆర్భాటాల మధ్య జీవితాన్ని సంక్షుభితం చేసుకోవడం, తమ గురించి కాక, తమ చుట్టూ వున్న సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనతో బతకడం లాంటి లక్షణాలు ఈ మధ్యతరగతికి అంటుకున్న ప్రవర. ఈ దశనుంచే విహారి ఇరవై ఒకటి శతాబ్దపు కొత్త వాకిలిని పరిచయం చేస్తాడు’’ అని నండూరి రాజగోపాల్ వి
శ్లేషించినా అది యథార్థం.

‘మాయతెర’ కథనానికి సంపుటికి ‘అంతరంగ నాదం’ అని తన మాట రాస్తూ ‘‘అనివార్య పరిస్థితులు నెట్టుకుపోతే ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి, పోరులో, పోరుతో సతమతమై, కడకు సమసిపోతున్న త్రిశంకు వర్గం కథానికలు ఇవన్నీ. నేను రాసే కథానికల్లో ఎప్పుడూ ఎక్కువ భాగం ఈ వర్గానికి చెందినవే. ఆ వర్గంవారి పాత్ర పోషణలో మనస్తత్వ విశే్లషణకి నా నేర్చినంత ప్రాధాన్యతనిస్తాను. నా కథానికలు సమయాన్నీ సందర్భాన్నీ, నిర్మాణాన్నీ వాటికవే కూర్చుకుంటాయి. నా కథల్లో నేను మధ్యతరగతి బతుకుపోరులో మందహాసాల మాటున ఉబికే మూగ సంవేదనల్ని వ్యక్తావ్యక్తంగా పాఠకుల ముందుంచుతాను. వ్యక్తంనుండి అవ్యక్తం అందుకోవడమే రసోల్లాసం అని ఆనాటి లాక్షణికులు అన్నారు. దానే్న సాహిత్యంలో అనిర్వచనీయత అని నేను నా వివిధ వ్యాసాల్లో సోదాహరణంగా ప్రతిపాదిస్తూ ఉన్నాను. అదే సాహిత్యంలో జీవిత సౌందర్యము. జీవన తాత్త్వికత కూడా. సాహిత్యం చేసే అసలైన మేలు వీటిని గ్రహించగలగడమే!’’ అని పేర్కొన్నారు స్వయంగా. అందుకే విహారి కథలు కాలంతో నడుస్తూ, కాలంతో నిలుస్తూ, కాలంతో గెలుస్తూ పాఠకులను అలరిస్తూన్నాయి. ఆయన విరామ రచయిత కాకుండా, నిర్విరామ కథకునిగా రాణించగలుగుతున్నారు.

ప్రముఖ కథా రచయిత బుచ్చిబాబు గారు కూడా EXISTENTIALISM అంటే అస్తిత్వవాదానికి ప్రాధాన్యత ఇచ్చినవారే. మధ్యతరగతికి మనశ్శాంతినిచ్చే మహామంత్రం అదే అనిపిస్తారు విహారి గారు కూడా. ‘స్పృహ’ అన్న ఆ జీవన తాత్త్వికతనే చిత్రించారు. నాలుగంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో వుండే ఆఫీసులో పనిచేసే రెడ్డిగారు భవనం మొత్తం కుప్పకూలి వందల సంఖ్యలో జనం చచ్చిపోయినా బ్రతికి బట్టకడతారు. నోట్లో వెండి చెంచాతో పుట్టిన ఆయన జీవితం తిరిగిన మలుపులు, పక్షవాతపు భార్య, నోరూ కాలూ లేని కొడుకు వున్నా ఆయన అస్తిత్వం వదులుకోలేదు. తరుగులోనే మెరుగు ఉంటుంది బతుకులో. ‘‘జీవితం నీకు ఎప్పుడు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించు. అది రాలేదని బాధపడీ, ఇది కావాలని ఆరాటపడీ మనంగా సాధించగలిగేది చాలా స్వల్పం’’ అన్న రెడ్డిగారి మాటే విహారిగారి బతుకు ఫిలాసఫీ! మానవ అస్తిత్వానికి నిర్ణీత లక్ష్యమేమీ లేదని ఈ జీవితానికి విలువ, అర్థం మనం ఇచ్చుకునేవేనని బోధించే తత్త్వధోరణే అస్తిత్వవాదం. జీన్‌పాల్ సార్త్రే సిద్ధాంతమూ ఇదే!

‘చలనం’ కథలోని శ్రీనివాస్ ఒకచోట అంటాడు- ‘‘దౌర్భాగ్యాలు రెండు రకాలు. ఒకటి ఎవర్నీ నమ్మలేకపోవడం. రెండవది అందర్నీ నమ్మడం. అసలు జీవితం నటన, ఆత్మవంచన, కపట నాటకం కాదంటావా? హృదయం ఏదో కావాలని తహతహలాడుతుంది. శరీరం దేన్నో పొందాలని వాంఛిస్తూ వుంటుంది. అది అందదనీ, దీన్ని పొందలేమనీ తెలుసు. అయినా ఏదో తపన. ఆ అగ్ని చల్లారదు. ఈ కాంక్ష చావదు. ఏమీ చెయ్యలేము. అస్థిమితత్వం- అలసత్వం, ఆరాటం, అసహాయత, వీటన్నింటినీ ఛేదించుకుని బయటికి రాలేక, ఆశలు ఆశయాల పరిధిమీద ఒకే బిందువును పదే పదే పాదాలతో చుంబిస్తూ ఒకటే పరుగు. చివరికి భయంకరమైన యాతనాభారంతో మనిషి చీకటి కోణంలో కూరుకుపోతూనే వున్నాడు’’. మధ్యతరగతి జీవి ప్రధానంగా లోనయ్యే జీవన స్థితి అదే'Man is a useless passion' అనేది చలనంలోని సంచలనం!

అయితే కథల్లో నైరాశ్యము, పలాయనము వుంటాయనుకోవడం సరికాదు. అనవసరపు ఆర్భాటాల నడుమ బ్రతుకు సంక్షుభితం కాకూడదనే హెచ్చరికనే అందిస్తారు విహారి. ఉదాసీనతకు ఉద్రేకానికీ కూడా సహజీవనం నేర్పి డబ్బు జబ్బులో పడకుండా విలువలకై నిలబడే దిశా నిర్దేశనం వారి కథల్లో సూచితాలు. పిల్లల స్వేచ్ఛను గౌరవించడం ‘కిటికీ తెరిస్తే’ కథలో వృద్ధతరానికీ సుబోధకం చేశారు.

సృజనశీలి అయిన కథకుడు స్రష్ట మాత్రమే కాదు ద్రష్ట కూడా కాగలుగుతాడనిపిస్తుంది. ‘నీడ’ కథలో సమాజపు ఒక వౌలిక మార్పును ఆయన ఆనాడే పసిగట్టారు. ఉమ్మడి కుటుంబ జీవనాలు ఆర్థిక మూలాలపై ఎలా విచ్ఛిన్నమవుతూ వస్తాయో ఊహించారు. అలాగే తెలుగు సాహిత్యంలో స్ర్తివాదం అంకుర దశలో ఉన్నప్పుడే ‘నిప్పు’ కథ ద్వారా స్ర్తి సాధికారిక స్వరాన్ని తండ్రినయినా ధైర్యంగా ప్రశ్నించే తనయ వైఖరినీ చిత్రించారు. అలాగే సరళీకృత ఆర్థిక విధానాలంటూ ప్రవేశించిన తరుణంలో రైతు జీవనం ఎలా ఛిద్రమైందీ, ఒకప్పుడు భూమిని నమ్ముకుని దర్జాగా బతికిన బతుకులే అమ్ముకుని ఎలా వలస జీవాలై కూలీలుగా, రిక్షావాళ్ళుగా, బిచ్చగాళ్ళుగా మారుతూ వచ్చిందీ ‘భ్రష్టయోగి’ కథ చదివితే కరతలామలకమవుతుంది. ‘వాస్తవాన్ని నమ్మక తప్పదుగానీ, అది ఇంత కఠోరంగా, దారుణంగా వుంటే భరించడం కష్టం’ అనిపింపజేసే గుండెల్ని పిండే కథే అది. 
భూ’మధ్యరేఖ కథలోనూ ఈ స్థితినే చెప్పినా రైతు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ప్రబోధిస్తూ ‘ప్రతి సమస్యకీ ప్రత్యామ్నాయం, పరిష్కారాలు వుండనే వుంటాయి’! అని ఆశావహ దృక్పథాన్నేఎగసన వేస్తారు. 

‘అడుగులో కాలేసినవాడు తీసుకోవడమూ, కాలు కడుక్కోవడమూ కూడా తానే నేర్చుకుంటాడు. మనిషికి చరిత్ర నేర్పుతున్న పాఠం ఇదేనమ్మా’ అని అస్తిత్వ వాదానికి ఊపిరులూదుతారు. ‘ఇల్లు ఒక చేదు మాత్ర’ వంటి కథ ద్వారా మంచివారిని మోసం చేసిన ఉసురు ఊరికే పోదన్న సంగతినే సంఘటనాత్మకంగా అనిపింపజేసేలా చిత్రిస్తారు. నడి సముద్రంలో ఎత్తయిన గిరిశిఖరం మీద వెలుగు కిరణంలా మానవత్వం భాసిస్తుందనే నమ్మికకు ప్రోదునిస్తుందీ కథ.

ఉత్తరాలు రాసుకునే కాలం పోయి ఉత్తగా సెల్‌ఫోన్‌లో మాటాడుకోవటాలూ, ఆ మాటాడుకోవడాలూ మాని ఎస్సెమ్మెస్‌లు ఇచ్చుకోవడం, ఛాటింగ్‌లు కాలం వచ్చింది. వాట్సప్‌లో మాటల టైపింగూ పోయి ఈమోజీలతో భావప్రకటనం చేసే వైఖరీ ప్రబలుతోంది. ఈ మార్పులు, సాంకేతికత కూడా అనివార్యాలే. ‘ఇల్లు చేదుమాత్ర’ కథానికలోని వస్తువునీ, శిల్పాన్నీ అభినందించిన పలు ప్రాంతాల పాఠకుల పేర్లనూ, సెల్‌నెంబర్లనీ కూడా విహారిగారు తమ కథానికా సంపుటి ‘మాయతెర’లో నమోదు చేయడం చూసినపుడు కాలావధుల్లో ఒదిగే ఆయన ఎలా కాలాతీత కథకునిగా సార్వజనీనం కాగలుగుతున్నారో కదా అని వందన సమర్పణ చేయాలనిపిస్తుంది.

ఏమయినా విహారి విలక్షణ హాయిని అందించే రిరంసా మానవీయ భావనల కథకుడు. పాఠక హృదయాలను అస్తిత్వ తాత్త్వికతతో రసప్లావితం చేసే పుణ్య కథకుడు. ‘మాయతెర’లను చీల్చి ‘గోరంతదీపం’ కాంతి ‘వలయం’లో బ్రతుకుకి అవసరమైన ‘చిరంజీవి ఆశ’ను ఆవాహన చేయించే సత్యనారాయణుడు. ఆ కథావిహారికి అభినందనల కైమోడ్పులు.
- సుధామ


Sunday, September 10, 2017

సాహితీదీపికలు



కీ.శే.కోట శ్రీనివాస వ్యాస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు గానీ కె.పి.వ్యాస్- ఐ.పి.ఎస్ అంటే తెలియని వారు లేరు.రాజధాని రోడ్ల మీద వాహన సంచారాన్ని గీతలు గీసి నిబంధనల్లో నియంత్రించి ట్రాఫిక్ సెన్స్ అంటూ కలిగించింది ఆయనే!నిఖార్సయిన పోలీస్ ఆఫీసర్ గా ఖ్యాతిగాంచి హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియంలో దారుణ హత్యకు గురి అయినది ఆయనే!ఆయన పేర పోలీస్ అకాడమీలో ఏటా స్మారకప్రసంగాలు జరుగుతున్నాయి.ఆయన కాంస్య విగ్రహం విజయవాడలో కూడా వుంది.

వ్యాస్ గారి ధర్మపత్నియే శ్రీమతి అరుణ. పుట్టింటి వారు గంటి వారు.జీవితపు ఆఘాతాన్ని తట్టుకున్న సాధికారక మహిళగా ఆమె సంస్కృతాంధ్ర ఆంగ్లాలలో నిష్ణాతురాలై ఒక రచయిత్రిగా,గొప్ప విదుషీమణిగా రాణిస్తున్నారు. ఇప్పటికే పది పుస్తకాలకు పైగా రచించి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం.సర్వార్థ సంక్షేమ సమితి,విజయభావనమిత్ర ,రాగరాగిణి సంస్థ;ల ద్వారా ఉత్తమరచయిత్రి అవార్డులు పొందిన శ్రీమతి అరుణావ్యాస్ సరికొత్త వ్యాస సంకలనం ' సాహితీ దీపికలు ' నవచేతన బుక్ హౌస్ ప్రచురణగా వెలువడింది.



మీ సుధామ పై గల గౌరవాదరాలతో సాహితీదీపికలు గ్రంధానికి పీఠిక రాయమని శ్రీమతి అరుణ కోరారు. ముద్రితప్రతి శ్రీమతి అరుణావ్యాస్ గారినుండి అందుకున్నాను.ఆ పీఠిక ,ఆవిడ పలుకు సాహితీదీపికలు గ్రంథంనుండి ఇక్కడ మీ కోసం......

Monday, July 4, 2016

గంటి భానుమతి సాగర మథనం







మనకున్న మంచి కథా రచయిత్రులలో 

శ్రీమతి .గంటి భానుమతి గారు ఒకరు.

ఇప్పటిదాకా
ఎనిమిది నవలలు ,అయిదు కథాసంపుటాలు 
వెలువరించిన భానుమతి గారు 
వందకు  పైగా వ్యాసాలు,కవితలు కూడా రాసారు.

2012 లో తెలుగు విశ్వవిద్యాలయం 
ఉత్తమరచయిత్రి గా సాహితీ పురస్కారం 
అందుకున్నారు .


శ్రీమతి గంటి భానుమతి గారి 
అయిదవ కథా సంపుటి 
' సాగర మథనం ' కు 
 గౌరవాదరాలతో నాతో
 పీఠిక రాయించుకున్నారు.


వారి కొన్నిపుస్తకాల ముఖచిత్ర పరిచయం 
ఆ పై 
సాగర మథనానికి  వారి మాట 
ఆ తరువాత 
కథాసుధ పేరిటి 
మీ సుధామ ముందుమాట 
మీకోసం.....









ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి కుమారుడి పెళ్ళి రిసెప్షన్ లో: ఎడమ నుండి గంటి భానుమతి,ప్రఖ్యాత కథా,నవలా రచయిత శ్రీ పోరంకి దక్షిణామూర్తి ,సుధామ,వరుడు చి.అరవింద్,వధువు చి.సౌ.కామ్నా (ఆదివారం 21.2.2016 సాయంకాలం,హోటల్ మినర్వా గ్రాండ్ ,సికిందరాబాద్.)



Friday, July 1, 2016

శ్రీమతి శారదా శ్రీనివాసన్ : చిరంజీవి సాహిత్య సమాలోచనం










రేడియో నాటకం అనగానే 

శ్రీమతి .శారదా శ్రీనివాసన్ గారే గుర్తొస్తారు. 

చలం గారి ' పురూరవ ' కు జీవం పోసి స్వయానా ఆయన ప్రశంసలకు 

పాత్రమైన ఖ్యాతి ఆవిడది.

ఆకాశవాణి లో వారితో కలసి పనిచేయడం ,వారి పక్కన 

రేడియో నాటకంలో నటించడం ఓ అదృష్టం .



శ్రీమతి శారదాశ్రీనివాసన్ గారు 

గురువుగా భావించే వ్యక్తి రేడియో నాటక విభాగంలోనే 

పనిచేసిన కె.చిరంజీవి గారు.


రేడియో నాటకానికి విశేష గౌరవం కలిగించీన ఆయన 

గొప్ప అభ్యుదయ నవలా,నాటక రచయిత .

"జైబోలో స్వతంత్ర భారత్ కీ జై "

అనే నవల వారి రచనల్లో విశిష్ఠమైనది.


పలు నవలలు ,రంగస్థల ,రేడియో నాటకాలు రచించిన

కె.చిరంజీవి గారి సాహిత్య సమాలోచనాన్ని 

ఒక గ్రంథంగా రాసీన ఘనత శ్రీమతి శారద గారికే దక్కుతుంది. 

అయితే తనపై సహోద్యోగి రాసిన ఆగ్రంథం అచ్చులో 

చూసుకోకుండానే ఆయన గత సంవత్సరమే కన్నుమూసారు.

అయితే శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు 

రాసి వినిపించింది అంతా ,సుధామ ముందుమాటతో సహా

విని సంతోషించారు .


చిరంజీవి సాహిత్య సమాలోచనం 

గ్రంథానికి 

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు కోరగా

" సమాజ శ్రేయోభిలాషి '" పేరిట రాసిన ముందుమాట ఇది 







Tuesday, June 28, 2016

శారదా అశోకవర్థన్ సిరిచుక్క గ్రంథం

 





శ్రీమతి శారదా అశోకవర్థన్


తెలుగు పాఠకులకు,శ్రోతలకు తెలిసిన పేరే ఇది.
కవయిత్రిగా,కథా,నవలా రచయిత్రిగా,నాటక కర్తగా,
వ్యాఖాత్రి గా
బాల సాహిత్యవేత్తగా
పేరొందిన వారామె. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాచార  శాఖలో 
పనిచేస్తూ,కొన్నేళ్ళు ఆకాశవాణి హైదరాబాద్ 
కుటుంబ సంక్షేమ విభాగంలో పనిచేసారు.
ఆ తరువాత 
జవహర్ బాల భవన్ డైరెక్టర్ గా
విశేష ఖ్యాతి పొందారు.


ఇరవైమూడు నవలలు 
పన్నెండు కవితా గ్రంథాలు 
ఏడు కథా సంపుటులు 
ఏడు నాటకాలు 
పన్నెండు బాల సాహిత్య గ్రంథాలు రాసిన 
శ్రీమతి శారదా అశోక వర్థన్  
ఆంధ్రభూమి లో ' శారదాలోచనం' ,' మరమరాలు ' 
కాలమ్ లు 
ఆంధ్రప్రభ బాలల పత్రిక ' చిన్నారి ' కోసం 
అయిదేళ్ళకు పైగా
మంచిమాట  శీర్షిక నిర్వహించారు.



ముందునుండీ  తాను సికింద్రాబాద్ నివాసియే!

ఇటీవలే శ్రీమతి  శారదా  అశోకవర్థన్

" నా సిరిచుక్క సికింద్రాబాద్ ' అనే గ్రంథాన్ని 
సికిందరాబాద్ చరిత్రతో బాటు 
తన ఆత్మ కథనాత్మక విషయాలతో రంగరించి  
వెలువరించారు. 

 పుస్తకానికి
మీ సుధామ ను 
ఒక ముందుమాట రాయమని కోరగా

" శారదాధామం సికింద్రాబాద్ " పేరిట రాసిన 
మున్నుడి ఇది 












" తమిరిశ జానకి మినీ కథలు"






1960 ల్లోని ప్రముఖ రచయిత్రులలో 

శ్రీమతి తమిరిశ జానకి గారు ఒకరు.

విశాలి,వీడిన మబ్బులు ,అశోకవనంలో సీత వంటి నవలలతో

పాఠకులను ఆకట్టుకున్నవారావిడ. 


విశాలి చలనచిత్రంగా కూడా వచ్చింది


పదిహేను నవలలు,

అయిదుకథా సంపుటాలు,

రెండు కవితాసంపుటులు 

వెలయించిన జానకి గారు 

తమ సరికొత్త మినీ కథా సంపుటి 

" తమిరిశ జానకి మినీ కథలు" కు 

మీ సుధామ ను ముందుమాట రాయమని కోరడం 

వారి సౌహార్ద్రం .

ఇదీ వారి మినీకథా సంపుటికి రాసిన మున్నుడి.




Wednesday, June 22, 2016

ఎలనాగ కొత్త బాణీ




'ఎలనాగ 'అనే పేర ప్రసిద్ధులైన 
డాక్టర్ .నాగరాజు సురేంద్ర గారు వృత్తిరీత్యా వైద్యులే 
అయినా 
ప్రవృత్తి రీత్యా మంచి సాహితీవేత్త. 
పద్య,గేయ ,వచన కవితా రచనలోనూ,
కథకునిగానూ,అంగ్లానువాదకునిగానూ 
పేరెన్నికగన్నవారు. 
ఇప్పటికి పలు కవితా 
సంపుటు లు ,అనువాద గ్రంథాలు వెలయించిన ఎలనాగ తమ పదహారవ ప్రచురణగా
సరికొత్తగా
'కొత్తబాణి 'పేర ప్రయోగపద్యాల సంపుటి ప్రచురిస్తూ
అపార గౌరవాభిమానంతో 
మీ సుధామ ను దానికి పీఠిక వ్రాయమని కోరారు. 

'ప్రమోద రశ్మి' పేర రాసిన ఎలనాగ ' కొత్తబాణి ' కి రాసిన 
ముందుమాట ఇది.
ముందు తనకవిత ఒకటి చూడండి. 
ప్రయోగపద్యాల ఆ గ్రంథానికి 
ఆ పై 
నా ముందుమాట గ్రహించండి. 


(క్రింద వాటిపై  క్లిక్ చేస్తే చదవడానికి వీలుగా 
పెద్దగా కాన వస్తాయి.)




ఎలనాగ