Showing posts with label భాషలో సొగసులు. Show all posts
Showing posts with label భాషలో సొగసులు. Show all posts
Tuesday, April 30, 2013
రుబాయీల కవి సమ్రాట్టు
చినుకు
మాసపత్రిక
8వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక
ఏప్రెల్ '2013
నిజంగా విశేష సంచిక గానే వెలువడింది.
60 రూపాయల వెల
ఈ ప్రత్యేక సంచికలో
రుబాయిల రచనలో అవిరళ కృషి చేస్తున్న
డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారి గురించి
నేను రాసిన
వ్యాసం ఇది.
Labels:
భాషలో సొగసులు
Saturday, May 19, 2012
ఊతాన్నిచ్చేవే ఊతపదాలు
సొగసు చూడతరమా అని కవిగారు ఊరకే అనలేదు.
సొగసు పాదాల్లో వుంటుందని చైనావారు ఎక్కువగా భావిస్తారట.
మనమూ పాదాల్లో సొగసులు చూస్తాం అయితే అది పద్యపాదాల్లో. వాక్య సముదాయంలోని వాక్యపాదాల్లో.
పాదాల్లో ప్రయోగించే పదాలే భాషలో సొగసు మరి!
ఒకరు మాట్లాడుతూంటే వినవేడుక కలుగుతోంది అంటే అది వారు భాషను ప్రయుక్తం చేసే తీరును బట్టే. భావాభివ్యక్తికి భాషను సొగసుగా వినిమయం చేయడంలోనే వక్త నేర్పు వుంటుంది
కొందరు తమ మాటల్లో సామెతలను జాతీయాలను ప్రయుక్తం చేస్తూంటారు. ఆ సందర్భానికి ఆ సామెత అతికితే సరే కానీ లేకపోయినా కొందరికి అదో అలవాటు.
‘ఏదోసామెత చెప్పినట్లు’ అంటారు. సామెత చెప్పకుండా ఆ మాట ప్రయోగించడం ఒక వైఖరి. ఇలాంటి వైఖరినే ఊతపదాలుగా భాషలో గుర్తించారు.
ఊతపదాలు కూడా ఒక సొగసే
!
అంతేకాదు, ఆ ప్రయోగించే ఊతపదాన్ని బట్టి ఆ వ్యక్తిని గుర్తించే తీరూ వుంటూంటుంది.
అంటే తమ సంభాషణకు ఆ సంభాషణ తొట్రువడకుండా సాగడానికీ ఓ ఊతపదం వారికి ఉండాలి.
ఇది నాకు ఇది చెప్పినప్పట్నుంచీ ఏదో ఇదిగా అనిపించింది. ఇది వద్దనుకున్నా అంత ఇది ఏమీ కాదుగానీ.. అంటూ ఆ ఇది ఏమిటో తెలియకుండా ఒకటే ఇదిగా మాట్లాడే వారుంటూంటారు. ఇది, అది, మరి లాంటి పదాలు ప్రసంగకర్తలు పదే పదే కొందరు ప్రయుక్తం చేసిగానీ, ముందుకువెళ్లలేరు.
ఒకాయన అభివృద్ధి సూచకంగానే కాదు పలు రకాలుగానూ ‘ఆ విధంగా ముందుకు పోతున్నాం’ అంటారు. ఆ ఊతపదం ఏమిటో తెలియగానే ఆ వ్యక్తి ఎవరో కనులముందు ఊహించుకోగలుగుతున్నామంటే అది ఊతపదంలోని సొగసే మరి!
ఒక ప్రాంతంలో విరివిగా వ్యవహృతవౌతూండే పదాలూ ఊతపదాలుగా భాసిస్తూంటాయ్- ‘ఆయ్!’,‘మరేనండి’, ‘కాదుమరీ’ వంటివి అలాంటి పదాలు. ‘వెధవ’ వంటి పదాలు మాత్రమే కాకుండా కొంత అశ్లీలార్థకంగా కనిపించే పదాలనూ తమ మాటల్లో - నిజానికి మనసులో అలాంటి భావం ఏమీ లేకపోయనా అలవోకగా వాడేస్తూంటారు కొందరు. ఒకాయన ప్రతిదానికీ ‘నా తలకాయ’ అంటూంటాడు. ‘సిగదరగ’ అని వాడుతూంటారు ఇంకొకరు.
ఊతపదం అనడంలోనే అర్థం తెలుస్తోంది కదా! ఆ పదం వాళ్లకు ‘ఊత’ అని. సంభాషణ సాగడానికి ఆ పదం వారికి వుండితీరాలి. అలా అనకుండా మాట్లాడమని మీరు శాసిస్తే వారు మూగవోతారు. ప్రయత్నించినా మాట్లాడలేకపోవచ్చు.
సామెతలను సంభాషణల్లో ఊతగా తీసుకునే వైఖరి అలాంటిదే. ఓ రాజుగారి ఆస్థానంలోని ఒక ఉద్యోగి మాట మాటాడితే సామెత చెబుతూండేవాడట. ఆ సామెతలు వినీవినీ రాజు గారికి విసుగొచ్చేసిందట. సామెత ప్రయోగించకుండా మాట్లాడమని హుకుం జారీచేశాడట. ఆ ఉద్యోగి వినిపించుకోకపోయేసరికి అతనికి ఉరిశిక్ష వేసాడట. తీరా ఉరితీసే సమయంలో జాలి కలిగి ‘‘ఇకనైనా సామెతలు చెప్పనని మాట ఇయ్యి, ఉరిశిక్ష రద్దుచేస్తాను’’ అన్నాడట. దానికా ఉద్యోగి ‘‘అలాగే మహారాజా! సామెతలు ప్రయోగించను. అసలు మాట్లాడటం కూడా తగ్గించేస్తాను. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదన్నారు’’ అన్నాడట. ఆ తర్వాత రాజుగారు ఏం చేసారో మరి!
కొందరికి పొడుపు కథలు వేస్తూ మాట్లాడటం అలవాటు. పొడుపు కథలది చాలా ప్రాచీనమైన చరిత్ర. అనేక దేశ విదేశీ భాషల్లో కూడా అవి వున్నాయి. పొడుపు వున్నపుడు విడుపు కూడా వుంటుంది.
'గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ' అంటూ మునుపు చిన్నతరగతి తెలుగు వాచకాల్లో పొడుపు కథలు వేసి, తేలు బొమ్మను అందుకు సమాధానంగా ముద్రించి పిల్లలను అలరించడం వుండేది.
ప్రయోగించే పదాలు, వాక్య నిర్మాణ చతురత, ఆకట్టుకునే తీరు వీటివల్లే భాషలో సంభాషణలు పరస్పర భావ వినిమయానికి సొగసుగా రాణిస్తూవున్నాయి.
సినిమాలలో కొన్ని పాత్రలకు రచయితలు సంభాషణల్లో చొనిపే ఊతపదాలు ఆ పాత్ర ప్రసిద్ధికి హేతువవుతూంటాయి. ‘సరే అలానే కానీయ్’, ‘అయితే ఓకే’, ‘అంత సీన్ లేదు’, ‘లైట్ తీస్కో’ అంటున్నారు నేటి తరం.
భాష భావ వినిమయ సాధనం అని ముందే చెప్పుకున్నాం కదా! లోకంలో సగం అనర్థాలకు అసలు కారణం అపార్థాలు. ఆ అపార్థాలకు హేతువు అనుకున్నది అనుకున్నట్లుగా అవతలివారు అర్థం చేసుకునేట్లుగా మాట్లాడలేకపోవడమే. కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం అనే మాట అందుకే వచ్చింది.
మాటలను ప్రయుక్తం చేయడం భావాభివ్యక్తికే అయినా ఆ అభివ్యక్తిలో తనదైన సొగసును చూపి మాట్లాడగలవారే రాణిస్తూంటారు.
అందుకే సంభాషణా చాతురి, ప్రసంగకళ వంటి మాటలు వచ్చాయి.
మాటలతోమోసాలు చేసేవారున్నారు. మాటలతో మానవ సంబంధాలను మెరుగుపరచగలవారూ వున్నారు. మాటతీరుకు భాషలోని సొగసును అందిపుచ్చుకుని సమర్థవంతంగా, సహేతుకంగా సకాలంలో సద్వినియోగపరచుకోవడం అవసరం.
ఏమైనా మన తెలుగు భాషలో సొగసులు గ్రహించి తెలుగులోనే మాట్లాడుకుందాం. బంధుమిత్రులతో కుటుంబసభ్యులతో తెలుగు మాట్లాడుకోవడమేకాదు చదవనూ, రాయనూ వచ్చినవారితో తెలుగులోనే రాతకోతలు సాగిద్దాం. భాషలోని సొగసులతో తెలుగు వెలుగు దీధితులను తేజరిల్లచేసుకుందాం.
-సుధామ
9849297958
ఆంధ్రభూమి (దినపత్రిక) 'నుడి '19,మే'2012 శనివారం
Labels:
భాషలో సొగసులు
Saturday, May 12, 2012
మాండలికం.. మహోన్నతం
(12)
భాష నిరంతరం ప్రవాహశీలం. అందులో కాలమాన పరిస్థితులకనుగుణంగా కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి.
ఇంతకీ భాష ప్రధానంగా భావవినిమయ సాధనమేకదూ! అంటే కమ్యూనికేషన్ అని దేన్నంటున్నామో అదే భాషకు ప్రధానం. అయితే భాషకు ప్రామాణికత అనే మాట ఒకటి వినబడుతూంటుంది. జనం మాట్లాడుకునే భాష వ్యవహార భాష. అయితే భాషలో సహజంగా లేని లక్షణాలను కవులు, రచయితలు, లాక్షణికులు కల్పించినంత మాత్రాన వాటికి ప్రామాణ్యం రాదు. రైల్వేసిగ్నల్ అంటే అర్థమైనట్లుగా ధూమశకట ఆగమన నిర్గమన సూచిక అంటే అర్థం కాదు- అది దానికి సరియైన పదమే అయినా. అంచేత ఎక్కువమందికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతో భాష పెరగాలి, పెంచుకోవాలి. ఇవాళ గ్లాసు, రోడ్డు, రైలు వంటి పదాలన్నీ జనసామాన్యానికందరికీ అర్థమయ్యేవే.
కవులు గుర్తింపబడని శాసనకర్తలు. అనుశాసన కర్తృత్వాన్ని కవికి మనం కట్టబెట్టినా లోకం ఒప్పదు. అంచేత కావ్య ప్రయోగాలన్నీ ప్రమాణం కాదు.
పామరులకన్నా పండితులు పట్టుబట్టే విషయం భాషా పరిశుద్ధత అనేది. ఆదానప్రదానాలు లేకుండా ఏ భాషా మడిగట్టుకు కూర్చోలేదు. తెలుగు అని మనం ఇవాళ అంటున్నదానిలో సంస్కృతం నుంచి తెచ్చుకున్న పదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ‘తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’ అని తిరుపతి వేంకట కవులు ఊరకే అనలేదు.
మన లాక్షణికులు సంస్కృత శబ్దాలు తెలుగులో ప్రవేశించడాన్ని చర్చించినంత విపులంగా అన్యదేశ్యాలు- హిందీ, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ వంటి వాటినుంచి వచ్చి చేరిన అనేకానేక పదాల విషయంలోమౌనంవహించారు. మాండలికాల విషయమూ అంతే!
నిజానికి జన జీవనంలో వాడుకలో వున్న అనేక పదాలకు కావ్య గౌరవం దక్కలేదు. ప్రాచీన నాటకాలు సంస్కృతాన్ని ప్రధాన పాత్రలకు పెట్టిస్త్రీపాత్రలకు ప్రాకృతం పెట్టడమూ కనిపిస్తుంది. సినిమాలలో కూడా కొన్ని ప్రాంతాల భాషను అయితే ప్రతి నాయకులకూ, లేకపోతే హాస్యపాత్రలకు నిర్థారించేసి వాడటం వల్లనే ,ఒక భాషలోనే ఎక్కువ తక్కువలు గౌరవ న్యూనతలు చోటుచేసుకున్నట్లయింది. ఈ పరిస్థితి అన్ని భాషల విషయంలోనూ తరతమ భేదంతో వుండనే వుంది.
అన్య దేశ్య నిషేధంవల్ల భాషకు పరిశుద్ధత, పవిత్రత లభిస్తాయనుకోవడం అశాస్త్రీయం అనాలి.భాషను శాసించాలన్న సంకల్పంగానీ, భాషలోని తప్పొప్పులను సామాజికేతర కారణాల ద్వారా ముఖ్యంగా అభిరుచి ప్రధాన బుద్ధితోనో,తార్కిక దృష్టితోనో నిరూపించాలనే ప్రయత్నం ప్రామాణికతా నిరూపకుల లక్షణం అనేవారు బూదరాజు రాధాకృష్ణగారు.
భాషలోని పరిణామాలకూ, భేదాలకూ ముఖ్య హేతువులు సామాజిక స్థితిగతులే. ఆర్థిక రాజకీయ భౌగోళిక సాంస్కృతిక కారణాలవల్ల, దేశ కాల పాత్రల స్వభావ పరిణామంవల్ల, భాషలో వచ్చే రూపభేదాలకూ ఆయా కాలాల్లో ఆయా సమాజాల్లో ఉండే గౌరవాగౌరవాలకూ పరస్పర సంబంధం వుంటుందనేది విస్మరించలేని విషయమే.
భాషలో ఈ పదాలే ఒప్పు ఈ పదాలే తప్పు అని ముఖ్యంగా వినిమయ భాషలో అస్సలు నిర్దేశించడం, శాసించడం సాధ్యంకాదు. అలా అన్నా వ్యవహారికం తదనుగుణంగా వుండదు. జనం తమ మాండలికంలోనే తమ కనుకూల వినిమయ వైఖరిలోనే అభివ్యక్తి కావించుకుంటారు.
నేడు మాండలిక రచనలు విరివిగా రావడానికి కారణం సజీవమైన భాష అంతరించిపోకూడదనే. పాత్రోచిత సంభాషణలు మాండలికంలో వుండడం అనివార్యమైన సంగతే. అలా లేకపోతే రచన జీవద్భాషలో వున్నట్లే తోచదు.
అయితే రచయిత మొత్తం మాండలికంలోనే ఒక నవలనో, కథనో రాయడంవల్ల ఆ మాండలికభాష తెలిసిన ప్రాంతానికే అది పరిసీమితమైపోతుందని వ్యాఖ్యానించేవారున్నారు. కానీ జీవద్భాషలో వివిధ మాండలికాల్లో వస్తున్న రచనలు గ్రంథస్థం కావడంవల్ల మిగతా ప్రాంతాలవారికి కూడా ఇతర ప్రాంతాల భాషా వ్యవహారంతో పరిచయం, అవగాహన ఏర్పడతాయి. సన్నిహిత సాంఘికాది సంబంధాలవల్ల భాషలో వచ్చే ఏకరూపత ఒకటి ఎలాగూ వుంటుంది. ఆ సామ్యాన్నేప్రామాణికం అనుకోవచ్చు. అయితే ఇలా ప్రామాణీకరింపబడానికి అన్ని ప్రాంతాల భాషా రూపాలు, సౌందర్యం, భావ వినిమయంలో ఆయా మాండలిక ప్రభావం దోహదమవుతాయి. కావాలి కూడాను.
పండితులను పామరులనుకరించటం జరుగుతూనే వుంటుంది. అలాగే జన మమేకమయ్యే పండితుడు ఆ పామర భాషనూ ఔచితీమంతంగా భావవినిమయానుకూలంగా అభివ్యక్తీకరించడమూ జరుగుతుంది.
జన సముదాయం యొక్క సామూహిక జీవనానికి ఉపకరించగలిగేది భాషయే. మానవ హృదయాలను ఏకీకరించటానికీ, విభేదాలు రేకెత్తించడానికీ రెండువైపులా పదునుగల కత్తిలాంటిదే భాష. కరవాలచాలనం తెలిస్తే కరచాలనం సులువవుతుంది.
జన్మజాతమైన భాషలో అధ్యయనం జరగడం ప్రధానం. తెలుగు మాధ్యమానికి దూరమయ్యే విద్యార్థి భాషా ప్రేమికుడు, భాషా సంపన్నుడు ఎలా కాగలుగుతాడు. అందువల్ల తెలుగును పరిరక్షించుకోవడం అంటే మాండలికాలతో సహా నేల నాలుగు చెరగులావున్న మన మాతృభాషను గౌరవించి సమాదరించి మాటలో, లిపిలో, మదిలో సుస్థిరపరచి భావ వినిమయం కావించాలి.
తెలుగు వెలుగు జిలుగులకు మాండలికాలు మట్టిదీపాలే కాదు మణిదీపాలు కూడాను.
Labels:
భాషలో సొగసులు
Saturday, May 5, 2012
పదమొక్కటే.. అర్థాలెన్నో
ఇంగ్లీషులో ‘పన్’ అంటాం. ఒకే పదానికి అనేక అర్థాలు స్ఫురించేట్లు చేసే చమత్కార
పద ప్రయోగం అది. దానినే మనం తెలుగులోశ్లేష అంటాం.
శ్లేషను ప్రయోగించుతూ మాట్లాడే శబ్దక్రీడ కూడా భాషలోని ఓ సొగసుతనమే.
శ్లేషను ఉపయోగిస్తూ ప్రాచీనకాలంలో తెలుగులో ద్వ్యర్థికావ్యాలు, త్య్రర్థికావ్యాలు రాసిన మహాకవులున్నారు. భారతార్థం వచ్చేలా, రామాయణార్థం వచ్చేలా రెండు రకాలుగా ద్యోతకమవుతూ పద్య రచనతో కావ్యాలల్లినవారున్నారు.
పింగళి సూరన రాసిన' రాఘవపాండవీయం' అటువంటి రెండర్థాల ద్వర్థికావ్యమే.గొప్ప శ్లేష వైభవంకలది. ఒక భాషలోని మాటల్ని ఆ భాషలోనే రెండు రకాలుగా విడగొట్టి రెండర్థాలను సాధించటం సభంగశ్లేష అంటారు. ఉచిత శబ్దశ్లేషఅని కూడా దానికి పేరు నానార్థాలు వచ్చేలా పదాలు ప్రయోగించటం అర్థశ్లేష.ఒక పదానికిగల ప్రసిద్ధమైన అర్థంతోపాటు మరొక అర్థాన్ని సాధించే చమత్కృతిని ముఖ్య గౌణవృత్తిశ్లేషఅనీ, పదం యొక్క అర్థాన్ని వేర్వేరుగా అన్వయించటాన్నిఅర్థాన్వయ శ్లేషఅనీ, అలాగే పదాలను వేర్వేరుగా అన్వయించటం శబ్దాన్వయ శ్లేష అనీ- ఇలాశ్లేషకూడా అనేక రకాలుగా పేర్కొనబడింది.
ఏమయినా పదము, పదము యొక్క అర్థం ఒకేలా కాకుండా పలురకాలుగా ధ్వనించే అందమే శ్లేషఅనేది.
ఆధునిక కాలంలో ఇంగ్లీషు, తెలుగు భాషల రెంటి పదాల సంకలనంతోనూ ఇలాంటిశ్లేషఉత్పత్తి చేసే చమత్కారం పెరిగింది. ‘పూర్వీకులు’ అంటే పూర్గానూ వీక్గానూ వుండేవారనీ, పండితుడు అంటే 'పన్' అనగాశ్లేషతో మాట్లాడేవాడనీశ్లేషఅనేదానికి ఇవాళ సరికొత్తదనాలు కూడా తోడవుతున్నాయి. సినిమాల్లో ద్వంద్వార్థాలు పాటల్లోనూ, సంభాషణల్లోనూ ఎక్కువైపోయాయి. కవిగారు ఓ పదం ప్రయోగించినా చిత్రీకరణలో దానికి వేరే అర్థంవచ్చేలా చూపడమూ జరుగుతుంది. ‘ఆకు చాటు పిందె తడిసె’ అని పాటలో కవి ఓ అర్థంలో ప్రకృతి పరంగా రాస్తే కెమెరా చిత్రీకరణలో తడిసిన హీరోయిన్ పైట చాటు అందాలు చూపడమూ దృశ్యశ్లేషఅనాలా మరి! ‘సినిమాల్లో ద్వంద్వార్థాలు ఎక్కడండీ బాబూ! ఒకటే అర్థం అది బూతే!’’ అని ఆర్తి చెందుతున్న వారూ వున్నారు.
నిజానికి శ్లేషలోమంచి చమత్కారం వుంది. సరదా వుంది. గుంభనమైన అర్థంవుంది. అరచాటు అందమూ వుంది. కానీశ్లేషను బూతుస్థాయికి దిగజార్చిశ్లేషఅంటేనే భయపడేలా చేస్తూ వచ్చింది ప్రధానంగా సినీ పరిశ్రమే అంటే కోపం తెచ్చుకోకూడదు.
పఠాభి అనే కవి ‘పఠాభి పన్చాంగం’ పేర ఇలాంటిశ్లేష వాక్యాల
సముదాయంతో ఎంతో సరదాలు పంచాడు. ఇటీవలి కాలంలో శంకరనారాయణ వంటి వారుశ్లేష భాషణం తోశ్లేషభాషణాలు నేడు హీరోల పలుకుల్లోకీ వ్యాప్తి చెందాయి. అతివేల శృంగార అర్థాలు స్ఫురించేశ్లేషలు జుగుప్సస్థాయికి దిగజారిన సందర్భాలూ వున్నాయి.
నిజానికిశ్లేష పదప్రయోగం గొప్ప ప్రజ్ఞ.
"రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
కుండుందద్గతి కావ్యమెల్లనగునే నోహోయనం జేయదే
పాండిత్యంబున నందునుం తెనుగు కబ్బంబద్భుతం బండ్రుద
క్షుండెవ్వాడిల రామభారత కథల్ జోడింప భాషాకృతిన్"
అని పింగళి సూరన రామ భారత కథలనుశ్లేషవైభవంతో రాఘవ పాండవీయంగా రచించి మెప్పు పొందాడు. ఉదాహరణకు సూరన ఒక పద్యంలో ‘ఏనుంగని కరమరయక’ అంటాడు. రామాయణార్థంలో ఏనుంగు + అని కరము + అరయక అని గ్రహించినప్పుడు ఏనుగనుకొని దశరథుడు ముని బాలకుని సంహరించాడు అనే అర్థంవస్తుంది. అదే భారతార్థంలో ఏనున్ + కనికరము+ అరయక అంటూ నేను దయలేకుండా మునిపై బాణం వేశానని పాండురాజు దిగులు చెందడంగా రెండో అర్థంగా వస్తుంది. ఇలా సూరన తన శబ్దశక్తిని ప్రయోగించి మొత్తం కావ్యాన్ని భారత, రామాయణార్థాలు రెండూ తెలిసేలా రాసాడు.
శ్లేషతో మాట్లాడటం కొందరికి సంభాషణా చాతుర్యంలో సహజవైఖరే. ఒకామె మిత్రునికి ఇల్లు చూపిస్తానని తీసుకువెడుతోంది. 'నాతి దూరమె యిల్లు పదములా'ఱె అన్నాడట అతను ఆమెతో. ఆమె కూడా 'నాతి దూరమె యిల్లు పదము లాఱె' అని బదులిచ్చింది. ఇక్కడ అతడు అడగడంలో' నాతీ! ఓ స్ర్తి దూరమే యిల్లు- అనగా ఇల్లు దూరమా? పదము లాఱె అనగా కాళ్లు నొచ్చుతున్నా' అంటే ఆమె సమాధానం 'న - అతి దూరమె యిల్లు అనగా ఇల్లు అతి దూరమేమీ కాదు పదములాఱె అంటే ఆరడుగులే ఇంక' అని అర్థం వెల్లడవుతుంది. ఇదిశ్లేషవైభవమే మరి!
పఠాభి ‘పన్’చాంగంలోని ఈ చమత్కరాలు గ్రహించండి.
‘‘నారికి వార నారికి నడుమ వారగలదు’’
‘‘పనిపాటలన్న నా కయిష్టము పాటలు రాయడం నా పని’’
‘‘దండం పట్టుట కన్నా పెట్టుట మంచిది’’
‘‘పువ్వు పుట్టగానే పరీమళించదు. పువ్వుగానే పరీమళిస్తుంది’’
‘‘కలవరమాయే మదిలో’’
ఇలాంటిశ్లేషచమత్కారాలు ఎన్నో.
ఒక సెలూన్ షాపు క్రిందనుండి మేడ మీదకు మార్చారు. యజమాని అక్కడ బోర్డు ఇలా పెట్టాడు ‘‘క్రింది వెంట్రుకలు నరుకు షాపు మెడపైకి మార్చబడినది’’ అని.' మే'డ బదులు 'మెడ' అని రాయడంతో ఇంకా నవ్వు రాదా మరి!ఇది శ్లేష కాదనుకోండి.అచ్చుతప్పు లాంటిదే!
శ్లేషఅనగానే అందులో అశ్లీలత చూడడం, చూపడం ఎక్కువైపోవడంవల్ల ద్వంద్వార్థాల శ్లేషకు గౌరవం పోగొట్టుకుంటున్నది మనమే. కానీ భాషలోని ఆ సొగసును అందంగా అందిపుచ్చుకుని 'మారేడు నీవని మారేడు తేనా నీ పూజకు' అని భక్తిగాశ్లేషించిన వేటూరి వంటి కవులూ వున్నారు. ఆశ్లేష మనం అందుకోవడంలో వుంది. ఔను కదా!
*
శ్లేషను ప్రయోగించుతూ మాట్లాడే శబ్దక్రీడ కూడా భాషలోని ఓ సొగసుతనమే.
శ్లేషను ఉపయోగిస్తూ ప్రాచీనకాలంలో తెలుగులో ద్వ్యర్థికావ్యాలు, త్య్రర్థికావ్యాలు రాసిన మహాకవులున్నారు. భారతార్థం వచ్చేలా, రామాయణార్థం వచ్చేలా రెండు రకాలుగా ద్యోతకమవుతూ పద్య రచనతో కావ్యాలల్లినవారున్నారు.
పింగళి సూరన రాసిన' రాఘవపాండవీయం' అటువంటి రెండర్థాల ద్వర్థికావ్యమే.గొప్ప శ్లేష వైభవంకలది. ఒక భాషలోని మాటల్ని ఆ భాషలోనే రెండు రకాలుగా విడగొట్టి రెండర్థాలను సాధించటం సభంగశ్లేష అంటారు. ఉచిత శబ్దశ్లేషఅని కూడా దానికి పేరు నానార్థాలు వచ్చేలా పదాలు ప్రయోగించటం అర్థశ్లేష.ఒక పదానికిగల ప్రసిద్ధమైన అర్థంతోపాటు మరొక అర్థాన్ని సాధించే చమత్కృతిని ముఖ్య గౌణవృత్తిశ్లేషఅనీ, పదం యొక్క అర్థాన్ని వేర్వేరుగా అన్వయించటాన్నిఅర్థాన్వయ శ్లేషఅనీ, అలాగే పదాలను వేర్వేరుగా అన్వయించటం శబ్దాన్వయ శ్లేష అనీ- ఇలాశ్లేషకూడా అనేక రకాలుగా పేర్కొనబడింది.
ఏమయినా పదము, పదము యొక్క అర్థం ఒకేలా కాకుండా పలురకాలుగా ధ్వనించే అందమే శ్లేషఅనేది.
ఆధునిక కాలంలో ఇంగ్లీషు, తెలుగు భాషల రెంటి పదాల సంకలనంతోనూ ఇలాంటిశ్లేషఉత్పత్తి చేసే చమత్కారం పెరిగింది. ‘పూర్వీకులు’ అంటే పూర్గానూ వీక్గానూ వుండేవారనీ, పండితుడు అంటే 'పన్' అనగాశ్లేషతో మాట్లాడేవాడనీశ్లేషఅనేదానికి ఇవాళ సరికొత్తదనాలు కూడా తోడవుతున్నాయి. సినిమాల్లో ద్వంద్వార్థాలు పాటల్లోనూ, సంభాషణల్లోనూ ఎక్కువైపోయాయి. కవిగారు ఓ పదం ప్రయోగించినా చిత్రీకరణలో దానికి వేరే అర్థంవచ్చేలా చూపడమూ జరుగుతుంది. ‘ఆకు చాటు పిందె తడిసె’ అని పాటలో కవి ఓ అర్థంలో ప్రకృతి పరంగా రాస్తే కెమెరా చిత్రీకరణలో తడిసిన హీరోయిన్ పైట చాటు అందాలు చూపడమూ దృశ్యశ్లేషఅనాలా మరి! ‘సినిమాల్లో ద్వంద్వార్థాలు ఎక్కడండీ బాబూ! ఒకటే అర్థం అది బూతే!’’ అని ఆర్తి చెందుతున్న వారూ వున్నారు.
నిజానికి శ్లేషలోమంచి చమత్కారం వుంది. సరదా వుంది. గుంభనమైన అర్థంవుంది. అరచాటు అందమూ వుంది. కానీశ్లేషను బూతుస్థాయికి దిగజార్చిశ్లేషఅంటేనే భయపడేలా చేస్తూ వచ్చింది ప్రధానంగా సినీ పరిశ్రమే అంటే కోపం తెచ్చుకోకూడదు.
పఠాభి అనే కవి ‘పఠాభి పన్చాంగం’ పేర ఇలాంటిశ్లేష వాక్యాల
సముదాయంతో ఎంతో సరదాలు పంచాడు. ఇటీవలి కాలంలో శంకరనారాయణ వంటి వారుశ్లేష భాషణం తోశ్లేషభాషణాలు నేడు హీరోల పలుకుల్లోకీ వ్యాప్తి చెందాయి. అతివేల శృంగార అర్థాలు స్ఫురించేశ్లేషలు జుగుప్సస్థాయికి దిగజారిన సందర్భాలూ వున్నాయి.
నిజానికిశ్లేష పదప్రయోగం గొప్ప ప్రజ్ఞ.
"రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
కుండుందద్గతి కావ్యమెల్లనగునే నోహోయనం జేయదే
పాండిత్యంబున నందునుం తెనుగు కబ్బంబద్భుతం బండ్రుద
క్షుండెవ్వాడిల రామభారత కథల్ జోడింప భాషాకృతిన్"
అని పింగళి సూరన రామ భారత కథలనుశ్లేషవైభవంతో రాఘవ పాండవీయంగా రచించి మెప్పు పొందాడు. ఉదాహరణకు సూరన ఒక పద్యంలో ‘ఏనుంగని కరమరయక’ అంటాడు. రామాయణార్థంలో ఏనుంగు + అని కరము + అరయక అని గ్రహించినప్పుడు ఏనుగనుకొని దశరథుడు ముని బాలకుని సంహరించాడు అనే అర్థంవస్తుంది. అదే భారతార్థంలో ఏనున్ + కనికరము+ అరయక అంటూ నేను దయలేకుండా మునిపై బాణం వేశానని పాండురాజు దిగులు చెందడంగా రెండో అర్థంగా వస్తుంది. ఇలా సూరన తన శబ్దశక్తిని ప్రయోగించి మొత్తం కావ్యాన్ని భారత, రామాయణార్థాలు రెండూ తెలిసేలా రాసాడు.
శ్లేషతో మాట్లాడటం కొందరికి సంభాషణా చాతుర్యంలో సహజవైఖరే. ఒకామె మిత్రునికి ఇల్లు చూపిస్తానని తీసుకువెడుతోంది. 'నాతి దూరమె యిల్లు పదములా'ఱె అన్నాడట అతను ఆమెతో. ఆమె కూడా 'నాతి దూరమె యిల్లు పదము లాఱె' అని బదులిచ్చింది. ఇక్కడ అతడు అడగడంలో' నాతీ! ఓ స్ర్తి దూరమే యిల్లు- అనగా ఇల్లు దూరమా? పదము లాఱె అనగా కాళ్లు నొచ్చుతున్నా' అంటే ఆమె సమాధానం 'న - అతి దూరమె యిల్లు అనగా ఇల్లు అతి దూరమేమీ కాదు పదములాఱె అంటే ఆరడుగులే ఇంక' అని అర్థం వెల్లడవుతుంది. ఇదిశ్లేషవైభవమే మరి!
పఠాభి ‘పన్’చాంగంలోని ఈ చమత్కరాలు గ్రహించండి.
‘‘నారికి వార నారికి నడుమ వారగలదు’’
‘‘పనిపాటలన్న నా కయిష్టము పాటలు రాయడం నా పని’’
‘‘దండం పట్టుట కన్నా పెట్టుట మంచిది’’
‘‘పువ్వు పుట్టగానే పరీమళించదు. పువ్వుగానే పరీమళిస్తుంది’’
‘‘కలవరమాయే మదిలో’’
ఇలాంటిశ్లేషచమత్కారాలు ఎన్నో.
ఒక సెలూన్ షాపు క్రిందనుండి మేడ మీదకు మార్చారు. యజమాని అక్కడ బోర్డు ఇలా పెట్టాడు ‘‘క్రింది వెంట్రుకలు నరుకు షాపు మెడపైకి మార్చబడినది’’ అని.' మే'డ బదులు 'మెడ' అని రాయడంతో ఇంకా నవ్వు రాదా మరి!ఇది శ్లేష కాదనుకోండి.అచ్చుతప్పు లాంటిదే!
శ్లేషఅనగానే అందులో అశ్లీలత చూడడం, చూపడం ఎక్కువైపోవడంవల్ల ద్వంద్వార్థాల శ్లేషకు గౌరవం పోగొట్టుకుంటున్నది మనమే. కానీ భాషలోని ఆ సొగసును అందంగా అందిపుచ్చుకుని 'మారేడు నీవని మారేడు తేనా నీ పూజకు' అని భక్తిగాశ్లేషించిన వేటూరి వంటి కవులూ వున్నారు. ఆశ్లేష మనం అందుకోవడంలో వుంది. ఔను కదా!
*
Labels:
భాషలో సొగసులు
Saturday, April 21, 2012
ప్రాసాక్షరాలు భాషకు ఆభరణాలు
'ఏమిటోయ్ సుబ్బారావూ ఏం చేస్తున్నావూ
పనిచేస్తేగానీ నువ్వు తగ్గవోయ్ లావూ
వేరేచోటికి తప్పదు బదిలీ ...
వొళ్లొంచి సరిగా పనిచేయకపోతే నీవు'
అంటూ
ఓ ఆఫీసర్గారు తన క్రింది ఉద్యోగితో అన్నారట. సరిగా పనిచేయకపోతే నీకు ట్రాన్సఫర్
తప్పదు అన్న హెచ్చరికనే ఆయన చేసినా సుబ్బారావుతో ఆయనలా మాటాడుతున్నప్పుడు అందరూ
నవ్వేస్తారు. సుబ్బారావుకు కూడా తగలాల్సినచోట ఆ హెచ్చరిక తగుల్తుంది కానీ మామూలుగా
తిడితే వచ్చే కోపమో, ఉక్రోషమో అంతగా రాకపోవచ్చు. మన భాషలో సొగసులో ప్రాస భాషణం
ఒకటి.
అంత్యాను ప్రాసతో మాట్లాడడం కొందరికి అలవాటు. అందులో ఓ అందం వుంది. ప్రాస అతి అయితే, ఆ కుతికి మతిపోయినట్లయి, వెగటూ కలిగించవచ్చనుకోండి. అది వేరు రీతి.
ప్రాస అనేది ఒక ఆలంకారిక ధోరణి. ఛందోబద్ద పద్య రచన చేయడానికి అనివార్యంగా యతి, ప్రాసల గురించి తెలిసి వుండాలి. పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాసస్థానంగా, నాలుగుపాదాల్లోనూ నియతిగల రచనా విధానం కావ్యాల్లోనూ కనిపిస్తుంది.
ప్రబంధకాలం గతించి ఆధునిక యుగంలోనూ గేయ కవిత్వంలో ప్రాస సంవిధానం సొబగులున్నాయి.
వచన కవిత్వం వచ్చాక కూడా వచన కవితా పితామహుడు అనిపించుకున్న కుందుర్తి ప్రాసలకు ముఖ్యంగా అంత్యప్రాసలకు చోటిచ్చారు.
అసలు కవిత్వం అంటే ప్రాసయుక్తంగా వుండడమనే భావన వున్నవారూ వున్నారు. అలా ప్రాసలతో సంభాషణల్లో అలవోకగా మాట్లాడేవారిని ‘కవిత్వం చెపుతున్నాడు రోయ్’ అనుకోవడమూ వుంది. ఆగ్డన్నేష్ అనే ఆంగ్ల కవి ప్రభావంతో ఆరుద్రరాసిన ఇంటింటి పజ్యాలు అందులోని హాస్య చమత్కారాల వల్లనే కాదు, ప్రాస పలుకులవల్లా మనోజ్ఞంగా భావించాయి.
కుందేలు తాబేలు వేసుకున్నాయి పందెం
గుట్టుగా చెబుతా తాబేలు గెలిచిన చందం
కుందేలు మారింది రెండు రైళ్లు
తాబేలు నడిచింది వందమైళ్లు
అంటూ ఆరుద్ర భారతీయ రైల్వేల సమయపాలన లేకపోవడాన్ని పరిహాసం చేస్తూ ఇంటింటి పజ్యాల్లో రాసాడు. పందెం, చందం, రైళ్లు, మైళ్లు అనే ప్రాస పదాలు ఎంత భావస్ఫూర్తిని కలిగించాయో తెలుస్తూనే వుంది కదా!
ప్రాసల ప్రయుక్తం ఉపన్యాస కళలో ప్రేక్షక జనరంజకత్వానికి ఎంతగానో ఉపకరిస్తుంది. డా.సి.నారాయణరెడ్డి ప్రసంగాలలో ఒకప్పుడు ఈ ఝరి బాగా వుండేది. క్లాసులో విజయవిలాసం పాఠం చెబుతూ కూడా' వేచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగన్...' అంటూ కవి పద్యపాదంచెప్పి 'ఆరు‘చి’లతో ఆర్చికట్టా'డు అంటూ పాఠం చెప్పి, అలరించేవారు ఆయన.
తిరుపతిలో అనుకుంటా ఒకాయన పేరే ప్రాసమణి. ఆయన మాట్లాడుతూంటే ఆశువుగా ప్రాస పదాలు అలా ఔచితీమంతంగా, అర్థవంతంగా దొర్లుకుంటూ వస్తాయి.
సినిమాలలో పాత్రలకుకూడా ఈ సంభాషణా ధోరణి పెట్టి హాస్యం పండించిన సన్నివేశ కల్పనలు అనేకం కానవస్తాయి. ‘మళ్ళీ మళ్ళీ జరగాలి చెల్లి పెళ్ళి’ అంటూ తనికెళ్ళ భరణి, అలాగే జంధ్యాల చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, శ్రీలక్ష్మి వంటి పాత్రధారుల చేత ఇలాంటి ప్రాసభాషణలు హాస్య సన్నివేశాలుగా రాణకెక్కాయి.
మాట్లాడుతున్నప్పుడు వాక్యాల చివరి అక్షరాలు ప్రాస పదాలుగా భాసించే తీరు ఒకటయితే, ఒకటే అక్షరాన్ని చివరనగల పదాలను వరుసగా అర్థవంతంగా ప్రయోగిస్తూ మాట్లాడటం ఒక పద్ధతి.' కిట్టు బెట్టు చేయక విట్టువేసినా రట్టు కాకూడదని ఆ పట్టున పెసరట్టు తింటూ ఒట్టు పెట్టుకు మరీ గట్టున కూర్చుని చెట్టు చుట్టూ చీమల్ని మట్టుపెడుతూ తిట్టుకున్నా పట్టుదలతో సంభాషణ చుట్టుకున్నాడు' అంటూ మాట్లాడటం ఓ తరహా అయితే,' కాకీక కాకికి కాక కేకికా; అనో,' నానీనానీ నీ నాను నూనెను నానెనని నేనన్ననా' అంటూ ఏకాక్షర ప్రయుక్తంగా మాట్లాడడం మరో తరహా! వీటి తీరులో భాసించేది ప్రాసలహాసమే!
ఈ ప్రాస భాషణా సంవిధానం యాంకరింగ్ అనబడే వ్యాఖ్యానాల్లో జనరంజనం చేయగలుగుతుంది. అయితే దానికి సద్యః స్ఫూర్తి, సమయోచితం ఉండాలి.'సాలూరు రాజేశ్వర్రావ్ రసాలూరు రాజేశ్వర్రావ్',' ప్రజ్ఞామతి భానుమతి' వంటి సరస ప్రయోగాలు వ్యాఖ్యానంలో అందాన్ని తెచ్చినవే.
ప్రాసకు అలంకార శాస్త్రంలో శబ్దాలంకారంగానే గుర్తింపు ఎక్కువ. ప్రాసలో అనుప్రాసము అంటూ ఛేకానుప్రాసము, వృత్త్యానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము అంటూ భేదాలు చెప్పబడ్డాయి. 'రసానుగతమగు ప్రకృష్టమగు వర్ణవిన్యాసము అనుప్రాసము' అని నిర్వచింపబడింది. రెండేసి హల్లుల జంటలను అనేక పర్యాయాలు పద్యంలో చెప్పటం ఛేకానుప్రాసమనీ ,ఆ రెండేసి హల్లుల జంటలో స్వరసాదృశ్య నియమము అనుషంగికమేననీ నిర్వచింపబడింది.
'ఒక్క వర్ణంబు కడదాకా నుద్ధరింపసరస జృంభణ వృత్త్వనుప్రాసమయ్యె' అనీ'సుమద విపక్ష శిక్షణ విచక్షణ! దక్షిణ దోరనుక్షణ' అంటూ ఉదాహరణగా ‘క్ష’కార ఆవృత్తిపద్యం చూస్తాం. సాహిత్య దర్పణంలో అనుప్రాసము- ఛేక, వృత్తి, శ్రుతి, అంత్య,లాటానుప్రాస అని అయిదు విధాలుగా చెప్పబడింది. యమకము, ముక్తపదగ్రస్తము అనే అలంకారాలుకూడా ఇలాంటి అందంతో కూడినవే. అనుప్రాస, యమకాలను కావ్యంలో ప్రయోగించే విషయంలో ధ్వనికారుడైన ఆనందవర్థనుడు' ప్రయత్న సాధ్యమగు ననుప్రాసము కాక అయత్నకృతమగు అనుప్రాసము' రసపుష్టినిస్తుందని చెప్పాడు.
‘‘ప్రాసకోసంకూసుకున్నా పాసిదానా!’’ అన్నట్లుగా కాక ప్రజ్ఞతో ఆయత్నంగా జరిగే ప్రాసభాషణం సహృదయ హృదయైకవేద్యమై రాణిస్తుంది. రసహాస భాసమానం ప్రాస. రసాభాస కాకుండా ప్రాసభాషణం భాషలోని సొగసే. అదొక విన్నాణం.
అంత్యాను ప్రాసతో మాట్లాడడం కొందరికి అలవాటు. అందులో ఓ అందం వుంది. ప్రాస అతి అయితే, ఆ కుతికి మతిపోయినట్లయి, వెగటూ కలిగించవచ్చనుకోండి. అది వేరు రీతి.
ప్రాస అనేది ఒక ఆలంకారిక ధోరణి. ఛందోబద్ద పద్య రచన చేయడానికి అనివార్యంగా యతి, ప్రాసల గురించి తెలిసి వుండాలి. పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాసస్థానంగా, నాలుగుపాదాల్లోనూ నియతిగల రచనా విధానం కావ్యాల్లోనూ కనిపిస్తుంది.
ప్రబంధకాలం గతించి ఆధునిక యుగంలోనూ గేయ కవిత్వంలో ప్రాస సంవిధానం సొబగులున్నాయి.
వచన కవిత్వం వచ్చాక కూడా వచన కవితా పితామహుడు అనిపించుకున్న కుందుర్తి ప్రాసలకు ముఖ్యంగా అంత్యప్రాసలకు చోటిచ్చారు.
అసలు కవిత్వం అంటే ప్రాసయుక్తంగా వుండడమనే భావన వున్నవారూ వున్నారు. అలా ప్రాసలతో సంభాషణల్లో అలవోకగా మాట్లాడేవారిని ‘కవిత్వం చెపుతున్నాడు రోయ్’ అనుకోవడమూ వుంది. ఆగ్డన్నేష్ అనే ఆంగ్ల కవి ప్రభావంతో ఆరుద్రరాసిన ఇంటింటి పజ్యాలు అందులోని హాస్య చమత్కారాల వల్లనే కాదు, ప్రాస పలుకులవల్లా మనోజ్ఞంగా భావించాయి.
కుందేలు తాబేలు వేసుకున్నాయి పందెం
గుట్టుగా చెబుతా తాబేలు గెలిచిన చందం
కుందేలు మారింది రెండు రైళ్లు
తాబేలు నడిచింది వందమైళ్లు
అంటూ ఆరుద్ర భారతీయ రైల్వేల సమయపాలన లేకపోవడాన్ని పరిహాసం చేస్తూ ఇంటింటి పజ్యాల్లో రాసాడు. పందెం, చందం, రైళ్లు, మైళ్లు అనే ప్రాస పదాలు ఎంత భావస్ఫూర్తిని కలిగించాయో తెలుస్తూనే వుంది కదా!
ప్రాసల ప్రయుక్తం ఉపన్యాస కళలో ప్రేక్షక జనరంజకత్వానికి ఎంతగానో ఉపకరిస్తుంది. డా.సి.నారాయణరెడ్డి ప్రసంగాలలో ఒకప్పుడు ఈ ఝరి బాగా వుండేది. క్లాసులో విజయవిలాసం పాఠం చెబుతూ కూడా' వేచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగన్...' అంటూ కవి పద్యపాదంచెప్పి 'ఆరు‘చి’లతో ఆర్చికట్టా'డు అంటూ పాఠం చెప్పి, అలరించేవారు ఆయన.
తిరుపతిలో అనుకుంటా ఒకాయన పేరే ప్రాసమణి. ఆయన మాట్లాడుతూంటే ఆశువుగా ప్రాస పదాలు అలా ఔచితీమంతంగా, అర్థవంతంగా దొర్లుకుంటూ వస్తాయి.
సినిమాలలో పాత్రలకుకూడా ఈ సంభాషణా ధోరణి పెట్టి హాస్యం పండించిన సన్నివేశ కల్పనలు అనేకం కానవస్తాయి. ‘మళ్ళీ మళ్ళీ జరగాలి చెల్లి పెళ్ళి’ అంటూ తనికెళ్ళ భరణి, అలాగే జంధ్యాల చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, శ్రీలక్ష్మి వంటి పాత్రధారుల చేత ఇలాంటి ప్రాసభాషణలు హాస్య సన్నివేశాలుగా రాణకెక్కాయి.
మాట్లాడుతున్నప్పుడు వాక్యాల చివరి అక్షరాలు ప్రాస పదాలుగా భాసించే తీరు ఒకటయితే, ఒకటే అక్షరాన్ని చివరనగల పదాలను వరుసగా అర్థవంతంగా ప్రయోగిస్తూ మాట్లాడటం ఒక పద్ధతి.' కిట్టు బెట్టు చేయక విట్టువేసినా రట్టు కాకూడదని ఆ పట్టున పెసరట్టు తింటూ ఒట్టు పెట్టుకు మరీ గట్టున కూర్చుని చెట్టు చుట్టూ చీమల్ని మట్టుపెడుతూ తిట్టుకున్నా పట్టుదలతో సంభాషణ చుట్టుకున్నాడు' అంటూ మాట్లాడటం ఓ తరహా అయితే,' కాకీక కాకికి కాక కేకికా; అనో,' నానీనానీ నీ నాను నూనెను నానెనని నేనన్ననా' అంటూ ఏకాక్షర ప్రయుక్తంగా మాట్లాడడం మరో తరహా! వీటి తీరులో భాసించేది ప్రాసలహాసమే!
ఈ ప్రాస భాషణా సంవిధానం యాంకరింగ్ అనబడే వ్యాఖ్యానాల్లో జనరంజనం చేయగలుగుతుంది. అయితే దానికి సద్యః స్ఫూర్తి, సమయోచితం ఉండాలి.'సాలూరు రాజేశ్వర్రావ్ రసాలూరు రాజేశ్వర్రావ్',' ప్రజ్ఞామతి భానుమతి' వంటి సరస ప్రయోగాలు వ్యాఖ్యానంలో అందాన్ని తెచ్చినవే.
ప్రాసకు అలంకార శాస్త్రంలో శబ్దాలంకారంగానే గుర్తింపు ఎక్కువ. ప్రాసలో అనుప్రాసము అంటూ ఛేకానుప్రాసము, వృత్త్యానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము అంటూ భేదాలు చెప్పబడ్డాయి. 'రసానుగతమగు ప్రకృష్టమగు వర్ణవిన్యాసము అనుప్రాసము' అని నిర్వచింపబడింది. రెండేసి హల్లుల జంటలను అనేక పర్యాయాలు పద్యంలో చెప్పటం ఛేకానుప్రాసమనీ ,ఆ రెండేసి హల్లుల జంటలో స్వరసాదృశ్య నియమము అనుషంగికమేననీ నిర్వచింపబడింది.
'ఒక్క వర్ణంబు కడదాకా నుద్ధరింపసరస జృంభణ వృత్త్వనుప్రాసమయ్యె' అనీ'సుమద విపక్ష శిక్షణ విచక్షణ! దక్షిణ దోరనుక్షణ' అంటూ ఉదాహరణగా ‘క్ష’కార ఆవృత్తిపద్యం చూస్తాం. సాహిత్య దర్పణంలో అనుప్రాసము- ఛేక, వృత్తి, శ్రుతి, అంత్య,లాటానుప్రాస అని అయిదు విధాలుగా చెప్పబడింది. యమకము, ముక్తపదగ్రస్తము అనే అలంకారాలుకూడా ఇలాంటి అందంతో కూడినవే. అనుప్రాస, యమకాలను కావ్యంలో ప్రయోగించే విషయంలో ధ్వనికారుడైన ఆనందవర్థనుడు' ప్రయత్న సాధ్యమగు ననుప్రాసము కాక అయత్నకృతమగు అనుప్రాసము' రసపుష్టినిస్తుందని చెప్పాడు.
‘‘ప్రాసకోసంకూసుకున్నా పాసిదానా!’’ అన్నట్లుగా కాక ప్రజ్ఞతో ఆయత్నంగా జరిగే ప్రాసభాషణం సహృదయ హృదయైకవేద్యమై రాణిస్తుంది. రసహాస భాసమానం ప్రాస. రసాభాస కాకుండా ప్రాసభాషణం భాషలోని సొగసే. అదొక విన్నాణం.
Labels:
భాషలో సొగసులు
Saturday, April 14, 2012
పర్యాయపదాలు : సొబగే కాదు.. ఒదుగు కూడా
తెలుగు చాలా సంపద్వంతమైన భాష అనడానికి ఒక పదానికి అనేక పర్యాయపదాలు వుండడమే గొప్ప నిదర్శనం.
భాష మీద పట్టు సాధించాలంటే, వాడిన పదం మళ్లీ వాడకుండా ఒక అంశం గురించి వివరించాలంటే పర్యాయ పదాలు గొప్పగా దోహదపడతాయి. అయితే ఒకే అర్థం ఇచ్చే పదమే అయినా సమయం, సందర్భం బట్టి ఆ పద ప్రయోగం చేయడంలోనే ప్రసంగకర్త మాటకారితనం, రచయిత అభివ్యక్తి విన్నాణం దాగి వుంటాయి.
మగవాడు, పురుషుడు, మనుష్యుడు అని మగవాడికి పర్యాయపదాలు వుండడంతో పోలిస్తే భాషలో స్త్రీ కి వున్న పర్యాయ పదాలు చూస్తే అనేకంగా కనిపిస్తాయి.
స్త్రీ అనే అర్థంలో అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, ఆడది, ఆడకూతురు, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభ్యాస, ఇందుముఖి, ఇందువదన, ఇగురుబోడి, ఇభయాన, ఉగ్మలి, ఉవిద, ఉజ్జ్వలాంగి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకంఠి, కనకాంగి, కమలాక్షి, కలకంఠి, కలశస్తని, కలికి, కాంత, కువలయాక్షి, కేశిని, కొమ్మ, కోమలి, కోమలాంగి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలువ, చేడె, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తొయ్యలి, తోయజాక్షి, దుండి, ననబోడి, నళినాక్షి, నవలా, నాతి, నారి, నీరజాక్షి, నీలవేణి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పల్లవాధర, పాటలగంధి, పుత్తడిబొమ్మ, పూబోడి, పైదలి, పొలతుక, ప్రమద, ప్రియ, బింబాధర, బింబోష్టి, బోటి, భామ, మగువ, మహిళ, మదిరాక్షి, మానిని, మానవతి, ముగుద, ముదిత, ముద్దుగొమ్మ, మెలత, యోష, రమణి, రూపసి, లతాంగి, లలన, లేమ, వనిత, వలజ, వారిజనేత్రి, వాల్గంటి, విరబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శాతోదరి, సుందరి, సుగాత్రి, సుదతి, సునయన, హంసయాన, హరిణలోచన, ఓహ్!... ఎన్నో వదిలేసానుగానీ ఇలా స్త్రీకి పర్యాయ పదాలు అపారంగా వున్నాయి.
అంతెందుకు... వట్టి బాలిక అన్న పదానికే అమ్మాయి, అమ్మి, కన్య, కన్యక, కుమారి, కొంజిక, కొండుక, కొమారి, చిన్నది, చిఱుతుక, ధీత, ధీద, నగ్నిక, నివర, పసిగాపు, పాప, పిన్నపాప, పిల్ల, పీపరి, పోఱి, బాల, గుంట, బాలిక, బాలకి, రోహిణి, వాసువు అనే పర్యాయపదాలున్నాయి.
మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని ప్రత్యేకంగా ప్రయోగించే పదం వుంది.
యువతికి ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు అనీ, వృద్ధురాలుకు జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ వంటి పదాలున్నాయి.
అయితే ఏ పదం ఏ సందర్భంలో ఎలా ఔచితీమంతంగా, అర్థవంతంగా ప్రయోగించి మాటాడాలో, రాయాలో తెలుసుకోవాలి. ఒక బిడ్డను మాత్రమే కన్న స్త్రీని కదళీవంధ్య అనీ, ఇద్దరు బిడ్డలు మాత్రమే కన్న స్త్రీని కాకవంధ్య అనీ ఒకప్పుడు అనేవారు.
దూషిత, హత అంటే కన్యాత్వము చెడినది అనీ, భర్త, పిల్లలు గతించిన స్త్రీని నిర్వీర అనీ, మారుమనువాడిన స్త్రీని పునర్భువు అనీ పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలు, అప్రజాత, అశశ్వి, గొడ్డురాలు, బందకి, వంజ, వంధ్య, వృషలి, శూన్య అనీ, గర్భవతియైన స్త్రీని అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి అని పేర్కొనడం వుంది.
అలాగే బాలెంతరాలు అయిన స్త్రీని జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి అని పేర్కొంటారు.
ఇలా స్త్రీకి వివిధ దశల్లో కూడా పేర్కొనబడే అర్థసూచక పదాలు అనేకం వున్నాయి. ఆత్రేయి, ఉదక్య, ఏకవస్త్ర, త్రిరాత్ర, నెలబాల,స్త్రీ ధర్మిణి అంటూ ఋతుమతి అయిన స్త్రీకి పర్యాయపదాలున్నాయి.
పర్యాయపదాలు గురించి చెప్పడానికి వాచవిగా తీసుకున్నదే ఇది. ఒక స్త్రీకే తెలుగు భాషలో ఇన్ని పర్యాయ పదాలు వ్యవహారంలోకి వచ్చాయంటే మన భాష ఎంత సంపద్వంతమో తెలియడంలేదా? పర్యాయపదాలు అని చెప్పుకుంటున్నాం కదా ..అసలు ఈ పర్యాయము అన్న పదానికే తడవ, అనుకల్పము, ఆవర్తి, ఆవృత్తి, తూరి, దఫా, పరి, పరువడి, పారి, పూపు, మఱి, మాటు, మాఱు, మొగి, రువ్వము, రువ్వు, విడుత, సారి అనే పర్యాయ పదాలున్నాయి తెలుసా!
నిజానికి పర్యాయ పదాలకు ఒక నిఘంటువే పూర్తిగా రూపొంది వుంది. ఆచార్య జి.ఎన్.రెడ్డిగారు పర్యాయ పద నిఘంటు నిర్మాణం ఒకటి చేసి ముఖ్యంగా యువతకు అందుబాటులోకి తెచ్చారు.
సమానార్థకాలుగా గానీ, సన్నిహితార్థాలుగా గానీ వుంటూ ,రూపభేదంతో ఉండేవి పర్యాయ పదాలు. సమానార్థకాలైనందువల్లనే కాకుండా అర్థచ్ఛాయల్లో ఉండే సూక్ష్మతర భేదాల్ని తెలుపడానికి కూడా ఈ పదాలు ఉపయుక్తంగా వుంటాయి. పూర్తి సమానార్థకాలు కొన్నయితే ,పాక్షిక సమానార్థాలుగా కొన్ని వుంటాయి.
ఈ పర్యాయ పదాలనేవి అభివ్యక్తి సామర్థ్యాన్ని బట్టి మాటల్లో, రచనల్లో వీటిని ఉపయుక్తం చేసి సొబగు చూపుకోవలసింది మనమే. ఏమంటారు.
Labels:
భాషలో సొగసులు
Saturday, April 7, 2012
అక్షరాలు అవే..అటొక అర్థం.. ఇటొక అర్థం
తెలుగు భాషలో కొన్ని పదాలు కుడి నుంచి చదివినా ఎడం నుంచి చదివినా ఒకే అర్థం ఇచ్చి పొరపాటు అనిపించవుగానీ, ఈ సూత్రం అస్తమాను వర్తించదు సుమండీ! కుడినుంచి చూస్తే ఒక అర్థం ,ఎడం నుంచి చూస్తే మరో అర్థం- అంటే ‘అటు ఇటు అయితే’ వేరు అర్థాలు ఇచ్చే అందమైన పదాలూ భాషలోని సొగసే!
కుడిచేత్తో అన్నం తింటూ అద్దంలో చూసుకుంటే ఎడంచేత్తో తిన్నట్టు వుంటుంది కదా! అలా అద్దంలో అర్థం తారుమారైనట్లు, పదాల అర్థమూ పసందుగా మారిపోయే పద సంపద మనకుంది.
రమ అంటే లక్ష్మీదేవి. ఆవిడని యంత్రంగా మార్చేసేయాలంటే రమ తిరగేసి మర అనాలి. వాల్మీకి బోయవాడుగా వున్నప్పుడు అతడిని మార్చడానికి నారదుడు అతగాడి నోరు తిరగడానికి వీలుగా 'మరా మరా' అనమని మంత్రోపదేశం చేసాడనీ, 'మరా మరా' అని పదే పదే బోయ జపిస్తూ, అది 'రామ రామ'గా మారి, రామ మంత్రోచ్ఛారణతో తపస్సిద్ధి పొంది, గొప్ప కవిగా మారి, రామాయణ మహాకావ్యాన్ని మనకందించాడనీ కథనం ఉంది.
నది దగ్గరకు వెళ్లి ‘కనుము’ అంటే సరిపోదు- తిరగేసి మునుక వేస్తేనే నదీస్నానం చేసినట్లు మరి! తల తిరిగిందనుకోండి- అది లత అయిపోతుంది. శ్రీశ్రీగారు ఓసారి తల తిరిగిన రచయిత్రి అని ఓ నవలా రచయిత్రి స్వభావాన్ని కూడా ధ్వనింపజేశారు.
ఒకరిపై కోపం వస్తే ‘కరచు’ స్వభావం ప్రకటించక్కర్లేదు. మాటల్లోనే ‘కరచు’ను తిరగేసి 'చురక' వేస్తే చాలుగా!
‘పడక’పోతే బాంబు తిరగేస్తారు. అదేకదా మరి సినిమాలు సీమ ప్రాంతం ‘కడప’కు సీమితం చేసిన భావజాలం.! పడక తిరగేసేది కడప! అలాగే ‘పడగ’ అటుగా ఎత్తి 'గడప' దగ్గర కన్పించవచ్చు. అది 'కలప'తో చేసింది చెక్కది అనుకుందామనుకున్నపుడు నాలుగువైపులా చెక్క చక్కగా వున్న ‘కలప’ తిరగేస్తే 'పలక’ అయిపోతుంది.
ఇలా అటొక అర్థం, ఇటొక అర్థం ఇచ్చే పదాలు భాషకు సొగసుల పరమార్థం! ‘పంచె’ అన్నది నిజానికి భారతీయ పురుషుడి ఒక సంప్రదాయ దుస్తు. ‘పంచె’ అటుగా ‘చెంప’ అయి క్రింద ఉడుపు, పైన ఓ నేత సానుభూతి యాత్రలో తడిమేది అయిపోవచ్చు.
‘తడుము’ అనేది తడుముతున్నప్పుడు అటుగా మరి ‘ముడత’ వచ్చేస్తుంది సుమండీ!
కాళ్లూ మొదలైన ఎడముగా సాగిన ‘శాఖ’కు ‘పంగ’ అనే వ్యవహారం వుంది. ‘పంగ’ అటుగా ‘గంప’ అయిపోతుంది. గంపలో నింపుకునేవి బోలెడుంటాయి.
'బాపురే' అని ఆశ్చర్యార్థక పదంగా వాడతాం. కాని అది ‘పురే’ అనే మూలరూపంగా వున్నదే. ‘పురే’ అనే పదం ఆశ్చర్యార్థకంగానూ, నిందార్థకంగానూ, ప్రశంసార్థకంగానూ కూడా కవులు ప్రయోగించారు. ‘‘చాలున్ బురే నరేశ్వరా ప్రచండతరం బగు నిట్టి సాహసం బేల యొనర్చెదీవు’’ అని హరిశ్చంద్రో పాఖ్యానంలో పద్యంలో ‘పురే’ నిందార్థకంగా వాడింది! ఇంతకీ తమాషాగా ఈ ‘పురే’ అటుగా వస్తే ‘రేపు’ అయిపోతుంది. ఇంగ్లీష్ది కాదండీ బాబూ! ఇవాళ తర్వాతదీ, ఎల్లుండికి ముందుదీ అయిన ‘రేపు’. నేడు కాక మరుసటి దినమన్నమాట.
తృణకాండము, సన్ననిపుల్ల, కట్టెపుల్లను- ‘పుడుక’ అంటాం. ఆ ‘పుడుక’ పదం అటుగా ‘కడుపు’ అయిపోతుంది.
విలాస విశేషాన్ని ‘గునుపు’ అంటాం. పిల్లలు మురిపెంగా గునుస్తూ వుంటారు కదా! అదే ‘గునుపు’. ఆ గునుపు పదం అటుగా ‘పునుగు’ అయి కూర్చుంటుంది. పునుగు పిల్లి గంధసారాన్నే మరి వేంకటేశ్వరస్వామి అర్చనలో నేటికీ తిరుపతిలో వినియోగిస్తుంటారు. 'పునుగు' గురించీ 'గునుపు' వుంది మరి!
‘గెంతు’ అని అంటూంటారు కానీ, అసలుకి ‘గంతు’ అనేది పదం. ‘గంతు’ అంటే ప్లుతగతిభేదం, దాటు, దుముకు అని అర్థాలు. ఆ ‘గంతు’ అటుగా ‘తుంగ’ అయ్యి ఓ చెట్టుగా మారిపోతుంది.
'టపటప' చినుకులు రాలుతాయి గానీ, ఆ పదం కుడి వైపుగా ‘పటపట’ చేస్తే- పళ్లు కొరకడం అవుతుంది. ‘కటకట’ వేరు ‘టకటక’ వేరు. ‘పీపా’ అటుగా ‘పాపీ’ అవుతుంది. నేతి మిఠాయి ‘నేతి’ అటుగా 'తినే’దవుతుంది. ఇలా అటొక అర్థం ఇటొక అర్థంగా భాషలో మాటల తికమకలు ఒక సొగసుగా అందాలొలికిస్తూ అలరిస్తూంటాయి. అందుకొని, మందహాసాలు చిలికించుకోండి మరి.
*
Labels:
భాషలో సొగసులు
Saturday, March 24, 2012
‘రూఢివాచకా’ల మెరుగులు
‘రూఢివాచకాలు'
రూఢి వాచకం అనేది భాషలోని మరో సొగసు.
ఒక పదానికి వాస్తవానికి వుండే అర్థం ఒకటి అయితే జనవ్యవహారంలో మరో అర్థానికి రూఢిగా వాడబడుతూండడమే ఈ విశేషం.
కాలక్రమేణా అర్థవిపర్యయం చెందేవి కొన్ని వుంటాయి. కానీ ఏ కాలానికయినా ఒక అర్థంలో రూఢిగా నిలిచేవి మరికొన్ని వుంటాయి.
అధ్వాన్నం అనే మాటను మనం ఇవాళ పనికిరానిది, బాగులేనిది, చెత్తగా వుంది అనే అర్థంలో వ్యవహరిస్తున్నాం. కానీ అధ్వము అంటే మార్గము. నిజానికి మార్గమధ్యంలో తినే అన్నం అధ్వాన్నం. మునుపు ఒక ఊరునుంచి మరో ఊరు ప్రయాణిస్తూ దారిలో తినడానికి మూట కట్టుకువెళ్ళేవారు. అది అధ్వాన్నం. కానీ ఇవాళ ఆ పదం యొక్క రూఢి వేరు.
ఒక పదానికి వాస్తవానికి వుండే అర్థం ఒకటి అయితే జనవ్యవహారంలో మరో అర్థానికి రూఢిగా వాడబడుతూండడమే ఈ విశేషం.
కాలక్రమేణా అర్థవిపర్యయం చెందేవి కొన్ని వుంటాయి. కానీ ఏ కాలానికయినా ఒక అర్థంలో రూఢిగా నిలిచేవి మరికొన్ని వుంటాయి.
అధ్వాన్నం అనే మాటను మనం ఇవాళ పనికిరానిది, బాగులేనిది, చెత్తగా వుంది అనే అర్థంలో వ్యవహరిస్తున్నాం. కానీ అధ్వము అంటే మార్గము. నిజానికి మార్గమధ్యంలో తినే అన్నం అధ్వాన్నం. మునుపు ఒక ఊరునుంచి మరో ఊరు ప్రయాణిస్తూ దారిలో తినడానికి మూట కట్టుకువెళ్ళేవారు. అది అధ్వాన్నం. కానీ ఇవాళ ఆ పదం యొక్క రూఢి వేరు.
రూఢివాచక శబ్దాలలో పురుష, స్త్రీ, వస్తు, జంతు రూఢివాచక పదాలు అనేకం వున్నాయి.
ఏ పేరూ లేనివాడిని ‘అగస్త్యభ్రాత’ అంటాం. అగస్త్యుడి సోదరుడి పేరు తెలియదు కనుక అలా రూఢి అయింది. అలాగే వాడొక ‘కుంభకర్ణుడు’ అంటాం. కుంభకర్ణుడు రావణుడి సోదరుడు. ఆరునెలలు నిద్రపోతే లేవగానే ఆకలి అంటాడు. అంచేత నిద్రముచ్చుకు కుంభకర్ణుడు అనే పదం రూఢి వాచక శబ్దమయింది. అలాగే '‘వాడు నక్షత్రకుడు’ అనుకో' అన్న వ్యవహార వాక్యంలో నక్షత్రకుడు అంటే పట్టువిడువక వెంటబడేవాడు అని. అప్పు వసూలు చేయడానికి హరిశ్చంద్రుని వెంటబడిన నక్షత్రకుడు జన వ్యవహార భాషలో అలా రూఢి శబ్దమయ్యాడు. అలాగే తిండిపోతుని ‘బకాసురుడు’ అంటాం. ఇలా పురాణాల నుంచి రూఢివాచక శబ్దాలు గ్రహించడం జరిగింది.
కానీ ఆధునిక కాలంలోనూ రూఢివాచక నామాలు ప్రముఖుల పేర్లనుండి జన వ్యవహార భాషలో ప్రత్యేకార్థంలో స్థిరమవుతూనే వున్నాయి. ‘సూర్యకాంతం’ అనే పదం గయ్యాళి అన్నదానికి రూఢి వాచకం అయింది. తెలుగు సినిమాల్లో సూర్యకాంతం ప్రభావం అలా ఎదిగి భాషలోకి వచ్చింది. ‘అంతులే’ అంటే, అంతులేని అవినీతికి స్థిరమైంది. అలాగే గొప్పగా పాడే లక్షణ వ్యవహారానికి ‘ఘంటసాల’ పేరూ నేడు భాషావ్యవహారంలో ఓ రూఢివాచకమయిందనవచ్చు.
పురాణాలలోనివి ఎన్నో పాత్రలు విశాల జన ప్రపంచం పరిధిలోనివి కనుక ఆ వాచక శబ్దాలు భాషలో ప్రత్యేకార్థంలో రూఢిగా ప్రయుక్తమవుతూంటాయి. గొప్ప బలశాలిని 'భీముడు’ అనీ, కపటిని, దుష్టుడినీ ‘శకుని’ అనీ అర్జునుడికి గల ‘సవ్యసాచి’ అనే పదాన్ని రెండు చేతులతో పనిచేయగల సమర్థుడనే అర్థంలోనూ.. ప్రయుక్తం చేయడం జరుగుతోంది. గురువు లేకనే కేవలం ఒకరిని లక్ష్యంగా గౌరవప్రదంగా పెట్టుకుని విద్యనభ్యసించేవాడిని ‘ఏకలవ్యుడు’ అంటాం.
అలాగే స్త్రీ రూఢి వాచక శబ్దాల విషయానికి వస్తే గొప్ప అందగత్తెను ‘రంభ’ అంటాం. ఆమె ఇంద్రసభలోని నాట్యకత్తె. ఉగ్రురాలు, కోపస్వభావిని అయిన స్త్రీని ‘భద్రకాళి’ అంటాం. తంత్రముగల దుష్టబుద్ధి స్త్రీని ‘మంథర’గా వ్యవహరిస్తాం. జానపద నాయిక అనగానే ‘ఎంకి’ అంటాం. ఆ ‘ఎంకి’ని అలా రూఢివాచక శబ్దం చేసిన ఘనత కవి నండూరి సుబ్బారావుగారిదే. అలాగే చుప్పనాతి బుద్ధిగల దుష్టురాలుకు రూఢి వాచక పదం ‘శూర్పణఖ’. తృప్తిగా అన్నం పెట్టే స్త్రీని ‘అన్నపూర్ణ’ అని భాషలో వ్యవహరించుతూ వుంటాం.
ఇక వస్తుగత రూఢివాచక శబ్దాలూ వున్నాయి మిక్కిలి యోగ్యతను ‘బంగారం’ అనీ, దృఢ సంకల్పాన్ని ‘ఉక్కు’ అనీ భాషలో పదప్రయోగం చేసినట్లే ఏమీ చేయని వాడిని ‘చట్రాయి’ అనీ, భారంగా పరిణమించినవాడిని ‘గుదిబండ’ అనీ వ్యవహరిస్తాం.
కష్టాలు కలిగే తావుని ‘నరకం’ అనీ ,సుఖప్రదేశాలను ‘స్వర్గం’ అనీ రూఢిగా పేర్కొంటాం. ప్రతిబంధకాలయిన వాటిని ‘సంకెళ్ళుగా మారాయి’ అంటాం. ముత్యం, రత్నం, వజ్రం, మణి ఇవన్ని వ్యక్తుల యోగ్యతకు ప్రయుక్తం చేస్తూండే రూఢివాచక శబ్దాలే. కోర్కెలు తీర్చే స్వభావం వున్న వితరణిశీలిని ‘కల్పవృక్షం’గా ‘కామధేనువు’గా పలుకుతాం.
ఇలాగే మానవ స్వభావంలోని వివిధ పార్శ్వాల, గుణాల ఉటంకింపునకు భాషలో వ్యవహరించే రూఢివాచక పదాలు అనేకం జంతు సంబంధులుగానూ ఉన్నాయి. పట్టుగలవాడిని ఉడుము అని, ఎలుగుబంటి అనీ, పంచతంత్రంలోని జంతు పాత్రలైన నక్కలని జిత్తులమారి అతి తంత్రము గలవారికి రూఢిగా ‘కరటకదమనకులు’గా ప్రయుక్తం చేస్తారు.
తెలివితక్కువవాడు ‘పశువు’గానే రూఢి. గొప్ప ధైర్యశాలిని సింహం, పులితోనూ, అమాయకుడిని ‘పిల్లి’పదంతోనూ, లోన సత్తా లేక, పైకి గాంభీర్య ప్రదర్శన చేసేవారిని ‘మేకపోతు’ అని, కొంటె పనులు చేసేవాడిని ‘కోతి’ అనీ, పీడించే స్వభావం కలవాడిని ‘జలగ’ అనీ, సాధుస్వభావినీ, పూజనీయుడినీ ‘గోవు’ అనీ, హానిచేసేవాడిని ‘పాము’ అనీ, ‘తేలు’ అనీ రూఢివాచక శబ్దాలతో వ్యవహారభాషలో ప్రయుక్తం చేస్తూంటాం.
ఇవన్నీ ఉదాహరణకు వాచవిగా ఎంపిక చేసి చెప్పిన రూఢి వాచక శబ్దాలే గానీ భాషా సౌందర్యం పరికించినపుడు ఇలాంటి అనేకం ఎవరికి వారు పట్టుకోవచ్చు. రూఢివాచక శబ్దాలుగా ఇలా భాషలో మానవ జీవన ప్రకృతి సంబంధులుగా వినియోగించే అర్థవంతమైన అద్భుత పద సంపద, ఆ వ్యవహారం, భాషలోని సొగసు. కాదంటారా!
-సుధామ
నుడి
(24.3.2012-శనివారం)
Labels:
భాషలో సొగసులు
Saturday, March 17, 2012
భాషకు ‘సమయాల’ సోకు
మన ప్రబంధాలు, కావ్యాలు భాషా పటిమను, భాషా సౌందర్యాన్ని అందించేవిగా వున్నాయి. తెలుగు సాహిత్యంలో ప్రబంధయుగం అని ప్రత్యేకంగా పేర్కొంటాం. శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను సమాదరించడం మాత్రమే కాదు స్వయంగా ఆముక్తమాల్యద అనే ప్రబంధం రచించాడు.
ప్రబంధ రచన అనేది కవి యొక్క ప్రత్యేక ప్రతిభ. దానికొక రచనా సంవిధానం వుంది. ప్రబంధాలలో అష్టాదశవర్ణనలను కవులు పాటించారు. వాటిద్వారా ‘కవి సమయాలు’ అనేవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. భాషలోని సొగసులో కవి సమయాలు ఒకటి.
సమయం అంటే సంప్రదాయం. అంటే ఆచారం లేక మర్యాద. ఈ సంప్రదాయాలు దేశదేశాచారాలలాగా ఎప్పుడో ఏర్పడినవే. సంఘజీవులయన వ్యక్తులు దేశాచారాలు పాటించవలసినట్లే, కవులు ఔచిత్యంతో రచన చేయడానికి ‘కవి సమయాలు’ పాటించారు.
‘కవి సమయాలు’గా రూఢమైన వాటిని మార్చడానికి వీలులేదు. మారిస్తే భాషే తలక్రిందవుతుంది. అయితే ఔచిత్య దృష్టితో కొత్తవాటిని సృష్టించుకోవచ్చంటారు ఆలంకారికులు.
‘కవి సమయాలు’ అంటే ఎక్కువగా ప్రకృతిగత విషయాలే. ఉన్న ధర్మాన్ని నిబంధించడం, లేని ధర్మాన్ని నిబంధించడం, కొన్నింటికి కొన్నింటి పట్లనే ఉనికిని నిబంధించడం ఈ కవి సమయాల్లో చూస్తాం.
కవి సమయాలలో కొన్నింటిని వర్ణించడానికి, కొన్నింటిని వర్ణించకపోవడానికి నియమాలున్నాయి. మాలతీలత వసంతంలో పుష్పించుతున్నట్లు, చందనద్రుమాలకు ఫలపుష్పాలున్నట్లు అశోకానికి పండ్లున్నట్లు, కృష్ణపక్షంలోవెన్నెల వున్నట్లు, శుక్లపక్షంలో అంధకారం వున్నట్లు, మల్లెమొగ్గలకు, కాముకుల దంతాలకు తాంబూలం వేసుకున్నా ఎర్రదనం వున్నట్లు వర్ణించకూడదు. అలాగే పగటిపూట నీలోత్పల వికసనం స్ర్తిలకు నల్లదనం వర్ణించారు. నదులలో పంకజాలు, నీలోత్పలాలు, తటాకంలో హంసలు, పర్వతాల్లో బంగారం, రత్నం, ఏనుగులు లేకపోయినా, వున్నట్లు వర్ణించడం కవిసమయం.
చీకటిని పిడికెట్లో పట్టుకోవచ్చట. సూదులతో భేదింపవచ్చునట. ఆకాశగంగలో దిగ్గజాలు స్నానం చేస్తాయి.వెన్నెల ను దోసిళ్లతో ఎత్తవచ్చు. శివుని తలపై వున్న చంద్రుడు ఎప్పటికీ బాలచంద్రుడే అని వర్ణించడం కవి సమయమే.
అలాగే రంగుల విషయం. కొన్ని కొన్ని రంగులను కొన్ని కొన్ని భావాలకు ప్రతీకలుగా వర్ణించడం కవి సమయాల్లో వుంది. కీర్తిని, పుణ్యాన్ని, నవ్వును తెలుపుతో, అపకీర్తిని, పాపాన్ని నల్లదనంతో, కోపాన్ని, అనురాగాన్ని ఎర్రగా, అలాగే శైల, వృక్షాది, మేఘ, సముద్ర, లతలకును, రాక్షస, ధూప, పంక, కేశములకు నల్లదనమే వర్ణించాలి. చందన వృక్షాలు మలయ పర్వతంలోనే వుంటాయి. వసంతంలోనే కోకిల కూస్తుంది. వర్షాకాలంలోనే నెమలి నాట్యమాడుతుంది. కేకి కేకలు వేస్తుంది. కృష్ణ అంటే నలుపు, నీల అంటే ఆకాశవర్ణం, హరిత అంటే ఆకుపచ్చ, శ్యామ అంటే ముదురుపచ్చ. ఈ వర్ణాలకు ఐక్యము చెప్పవచ్చు అంటే కవి సమయాల ననుసరించి భేదం పాటించనవసరం లేదన్నమాట. అందుకే శ్యామసుందరుడు, నీలమేఘ శ్యాముడు కృష్ణపరమాత్ముడు అంటూ కృష్ణుని వర్ణించడం వుంది.
చంపక, భ్రమరాలకు విరోధం వున్నట్లు, చక్రవాక దంపతులకు రాత్రి వియోగం కలుగునట్లు, స్త్రీకి రోమావళి వున్నట్లు, సమద్రంలోనే మొసళ్లున్నట్లు, తామ్రపర్ణి నదిలో ముత్యాలు లభిస్తాయని వర్ణించాలి. ధ్వజము, చామరము, హంస, హారము, కొంగ, భస్మము వీటిని తెల్లదనమే వర్ణించాలి.
చంపక, భ్రమరాలకు విరోధం వున్నట్లు, చక్రవాక దంపతులకు రాత్రి వియోగం కలుగునట్లు, స్త్రీకి రోమావళి వున్నట్లు, సమద్రంలోనే మొసళ్లున్నట్లు, తామ్రపర్ణి నదిలో ముత్యాలు లభిస్తాయని వర్ణించాలి. ధ్వజము, చామరము, హంస, హారము, కొంగ, భస్మము వీటిని తెల్లదనమే వర్ణించాలి.
అలాగే స్త్రీల కొన్ని చర్యలతో వృక్షాలకు సంబంధించిన విషయాలు కవిసమయాల్లో ప్రసిద్ధంగా వున్నాయి. పద్మినీ జాతి స్త్రీ తన్నడంవల్ల అశోకవృక్షం పుష్పిస్తుoదిట. వారు పుక్కిటబట్టి ఉమియడంవల్ల పొగడ చెట్టు, వారి కౌగిలింతతో గోరంట, వారి చూపులు సోకి బొట్టుగుచెట్టు, వారు నర్మగర్భంగా మాట్లాడడంతో మందారం, వారి నవ్వుతో సంపెంగ, వారి ముఖానిలంతో మామిడిచెట్టు, వారి సంగీతంవల్ల సురపొన్న, వారి నర్తనంతో కొండగోగుచెట్టు వికసిస్తాయని ‘కవి సమయం’. వసుచరిత్ర వ్యాఖ్యాత మాకందం స్త్రీల కరస్పర్శతో సంపెంగ ముఖరాగంతో, ప్రియాళువు సంగీతంతో వికసిస్తాయని పేర్కొన్నాడు.
కవులు కాలౌచిత్యాన్ని పాటించి ఋతువర్ణం చేయాలనీ, ఏ ఋతువులో ఏయే విషయాలను ప్రస్తావించాలనేది కవి సమయాలు సూచిస్తూంటాయి. లోకంలో అవి నిర్థారితాలుగా భాసిస్తూ వుంటాయి. అలాగే సంఖ్యానియమం కూడా వుంది. త్రికాలాలు, త్రిభువనాలు, త్రినేత్రుడు అంటాం. అలాగే తాంబూలగుణాలను త్రయోదశ సంఖ్యగానే చెప్పాలి. చంద్రుడివి పదహారు కళలు అంటారు. ఇలా కావ్యగత, ప్రబంధగత అంశాలుగా కవిసమయాలు కవుల రచనల్లో ప్రతిబింబితమవుతూ రావడం ఒక రచనా సౌందర్యంగా, భావాభివ్యక్తీకరణ సొబగుగా రాజిల్లుతోంది.
ఇప్పుడు ఈ కవి సమయాలు అనేకం పాతబడినట్లు, ప్రయుక్తంలో లేనట్లు కావడానికి అసలు కవిత్వ రీతుల్లో పద్య రచనా ఫణితి మందగించడమూ హేతువే. ఏమయినా పద్య వారసత్వాన్ని, హృద్యమైన పద్యంలో కవి సమయాల సౌందర్యాన్ని సంరక్షించుకుంటే భాషలోని పెన్నిధులను సంరక్షించుకున్నట్లే.
-సుధామ
(ఆంధ్రభూమి దినపత్రిక 'నుడి 'శనివారం 17.3.2012)
(ఆంధ్రభూమి దినపత్రిక 'నుడి 'శనివారం 17.3.2012)
Labels:
భాషలో సొగసులు
Saturday, March 3, 2012
జంటపదాలు.. భాషకు సిరిసంపదలు
ఆమె ‘అందచందాలు’ ఎంతగానో నచ్చాయి. ‘ఊరూవాడా’ ఆ విషయం తెలుసు. ‘చీకుచింత’ లేకుండా ‘ఈడుజోడు’ అయి బ్రతకాలంటే ‘చేదోడువాదోడు’గా వుండాలి.
ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ వుండేవే. వీటిల్లో అందచందాలు, ఊరూవాడా, చీకుచింత, ఈడుజోడు, చేదోడువాదోడు వంటివాటినే ‘జంటపదాలు’ అంటాం.
ఇలాంటి జంట పదాలు ప్రయోగించడంలో గొప్ప సొగసువుంది. వట్టి సొగసు మాత్రమే కాదు ఎంతో అర్థవంతమైన భావవినిమయం వుంది. అందచందాలు అన్న జంటపదమే చూడండి. అందం అంటే సౌందర్యం. నిజానికి సౌందర్యం అనేది ఒక విధానంలో, రీతిలో సజావుగా వుండాలి. చందము అన్నదానికి విధము, రీతి, ప్రకారము అని అర్థం. అందం చందం రెండూ వున్నప్పుడే పూర్ణత్వం. చందము అన్నదానికి కర్పూరం అనే అర్థం కూడా వుంది. బంగారానికి తావి అబ్బినట్లు అంటూంటాం. అలాగే సౌందర్యం పరిమళవంతం అయితే విలువ ఎక్కువ. అందచందాలు అనడంలో అంత విశేష అర్థస్ఫూర్తి వుంది.
మన భారతీయ సంప్రదాయంలో దాంపత్య బంధానికి ఎంతో విలువ. అందునా స్ర్తికి ప్రథమస్థానం. ‘భార్యాభర్తలు’, ‘అమ్మానాన్న’ వంటి జంట పదాలను ప్రయుక్తం చేయడంలోనే కాదు సీతారాములు, ఉమామహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు వంటి వాటిని కూడా జంటపదాలుగా వ్యవహరిస్తూ స్ర్తిని ప్రథమగణ్యగా ఉటంకిస్తూంటాం.
జంటపదాలులో ‘తికమక’ ఏం లేదు. భావనలను ‘తారుమారు’ చేయదు. జంటపదాల ‘తళుకుబెళుకు’ల్లో ‘ఎగుడుదిగుడు’లు ఏమీ ఊహించనవసరంలేదు. ‘మాటామంతీ’లో జంటపదాలు ‘ముందువెనుక’లు చూసి ప్రయోగించుకుంటే, ‘చదువు సంధ్యలు’లో వాటి ఉపయుక్తం గ్రహించుకుంటే మన భావాభివ్యక్తి ‘బాగోగులు’ జంటపదాలు చూసుకోగలుగుతాయి.
సుఖ దుఃఖాలు, సిరిసంపదలు, కలిమిలేములు, పాపపుణ్యాలు, చీకటి వెలుగులు ఇవన్నీ జంటపదాలే. కొన్ని జంటపదాలు ఒక అంశం యొక్క ఇరుపార్శ్వాలను ప్రతిబింబించేవయితే, మరికొన్ని ఆద్యంత సమాహారాన్ని సూచించేవి. ఇంకొన్ని సమర్థక, వ్యతిరేకార్థక సమన్వయ సూచికలు. ‘కష్టసుఖాలు’ జీవితం ఇరు పార్శ్వ ప్రతిబింబకాలు. ‘సూర్యచంద్రులు’ అన్న జంటపదం ఒక రోజు యొక్క ఆద్యంత సమాహారమే. ‘మంచిచెడు’ అనేది సమర్థక వ్యతిరేకార్థక జంటపదమే.
రూపురేఖలు, వేషభాషలు, వేళాపాళా, సిగ్గు ఎగ్గు, కూలీనాలీ, ఇంచుమించు ఇలాంటి జంటపదాలన్నీ విరివిగా వింటూనే వుంటాం. ‘ఇంచుమించు’ అన్న జంటపదంలో ఇంచు అన్నదానికి అల్పత్వము, న్యూనత్వము, ఇంచుకతనము అని అర్థం కాగా, ‘మించు’ అన్నదానికి ఒప్పు, శోభిల్లు, అతిశయించు, తళతళ మెరియు అనే అర్థాలున్నాయి. కానీ ‘ఇంచుమించు’ అని వాడినప్పుడు రమారమి, ఎక్కువ తక్కువగా అనే రూఢ్యర్థంలోనే వాడుతున్నాం. అదీ దీని సొబగు. ఇంచు అన్నదానికి చెఱకు అనే అర్థం కూడా వుండడంవలన చెఱకు విలుకాడు అయిన మన్మధుడిని ఇంచువిల్తుడు అనడమూ వుంది. సరే! అది వేరు సంగతి.
‘చిటపట’లాడాడు, ‘గడబిడ’ చేసాడు ‘చీటికిమాటికి’ గుర్తుచేస్తున్నాడు, ‘పాపపుణ్యాలు’ దేవుడెరుగు, ‘మూటముల్లె’ సర్దుకున్నాడు ‘కట్నకానుకలు’ కోసం ‘కోపతాపాలు’ చూపడం, ‘అవాకులు చెవాకులు’ పలకడం సరికాదు. ఇలా వాక్యాలు జంటపదాలు ఎన్నిటినో ప్రయోగించడం జరుగుతూనే వుంటుంది.
జంటపదాలు విడగొట్టి మొదటి పదానికి అర్థం రెండోపదానికి అర్థం విడివిడిగా చూసుకుంటే కనబడే సొగసులు వేరు. ఒకటిగా ఆ జంటపదం ప్రయుక్తం అయినపుడు ఒక్కోసారి ద్యోతకమయ్యే సొగసు వేరు. శ్రద్ధ్భాక్తులు, భయభక్తులు, ధనధాన్యాలు, ధూపదీపాలు, పేరుప్రతిష్ఠలు, భోగభాగ్యాలు అంటూ ఇలా జంటపదాలు అనేకం వున్నాయి. ఏ రెండుపదాలు పడితే ఆ రెండు పదాలు కలిపేస్తే జంటపదాలు అయిపోతాయనుకుంటే పొరపాటు.
జంటపదాల నిర్మితిలో ఓ సొబగు వుంది. అది భాషలో విలక్షణమైనది, విశిష్టమైనది కూడాను. కూడుగుడ్డ, ఇల్లూ వాకిలి, ఉప్పుపప్పు, ఉలుకు పలుకు, ఇంపుసొంపు, గొడ్డుగోద, చెట్టుచేమ ఇలా జంటపదాలు గురించి ‘చాటుమాటు’ కాక ‘చేదునిజాలు’గానే భాషాసౌందర్యాన్ని ‘తప్పుఒప్పులు’ లేకుండా పట్టుకోవచ్చు.
భాషలోని ఈ జంటపదాల సౌందర్యం కూడా ‘అతీగతీ’ లేకుండా పోయే పరిస్థితి రాకుండా ఇవాళ మనం ప్రసార మాధ్యమాల్లో యాంకరింగ్ అని చెప్పుకునే వ్యాఖ్యానాల్లో సందర్భోచితంగా చేర్చి ప్రయోగిస్తుంటే తెలుగు సౌందర్యం తేజరిల్లడమే కాదు నిజంగా శ్రవణంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతాయి. యాంకర్ విజయానికి ఇవి ‘అండదండలు’గా వుండగలుగుతాయి.
‘ఆదరాబాదరా’ కాకుండా సావకాశంగా జంటపదాలును అధ్యయనం చేసి చూడండి. వాటి ‘బాగోగులు’ అర్థమవడమే కాదు భాషకు అది ఎలాంటి ‘సిరిసంపదలు’ అయి నిలుస్తున్నాయో కూడా తెలుస్తుంది. భాషలోని సొగసు పార్శ్వాన్ని అందివ్వడమే ఇక్కడి వంతు. అల్లుకుపోవడం భాషాభిమానులైన అందరి తంతు. ఏమంటారు.
ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ వుండేవే. వీటిల్లో అందచందాలు, ఊరూవాడా, చీకుచింత, ఈడుజోడు, చేదోడువాదోడు వంటివాటినే ‘జంటపదాలు’ అంటాం.
ఇలాంటి జంట పదాలు ప్రయోగించడంలో గొప్ప సొగసువుంది. వట్టి సొగసు మాత్రమే కాదు ఎంతో అర్థవంతమైన భావవినిమయం వుంది. అందచందాలు అన్న జంటపదమే చూడండి. అందం అంటే సౌందర్యం. నిజానికి సౌందర్యం అనేది ఒక విధానంలో, రీతిలో సజావుగా వుండాలి. చందము అన్నదానికి విధము, రీతి, ప్రకారము అని అర్థం. అందం చందం రెండూ వున్నప్పుడే పూర్ణత్వం. చందము అన్నదానికి కర్పూరం అనే అర్థం కూడా వుంది. బంగారానికి తావి అబ్బినట్లు అంటూంటాం. అలాగే సౌందర్యం పరిమళవంతం అయితే విలువ ఎక్కువ. అందచందాలు అనడంలో అంత విశేష అర్థస్ఫూర్తి వుంది.
మన భారతీయ సంప్రదాయంలో దాంపత్య బంధానికి ఎంతో విలువ. అందునా స్ర్తికి ప్రథమస్థానం. ‘భార్యాభర్తలు’, ‘అమ్మానాన్న’ వంటి జంట పదాలను ప్రయుక్తం చేయడంలోనే కాదు సీతారాములు, ఉమామహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు వంటి వాటిని కూడా జంటపదాలుగా వ్యవహరిస్తూ స్ర్తిని ప్రథమగణ్యగా ఉటంకిస్తూంటాం.
జంటపదాలులో ‘తికమక’ ఏం లేదు. భావనలను ‘తారుమారు’ చేయదు. జంటపదాల ‘తళుకుబెళుకు’ల్లో ‘ఎగుడుదిగుడు’లు ఏమీ ఊహించనవసరంలేదు. ‘మాటామంతీ’లో జంటపదాలు ‘ముందువెనుక’లు చూసి ప్రయోగించుకుంటే, ‘చదువు సంధ్యలు’లో వాటి ఉపయుక్తం గ్రహించుకుంటే మన భావాభివ్యక్తి ‘బాగోగులు’ జంటపదాలు చూసుకోగలుగుతాయి.
సుఖ దుఃఖాలు, సిరిసంపదలు, కలిమిలేములు, పాపపుణ్యాలు, చీకటి వెలుగులు ఇవన్నీ జంటపదాలే. కొన్ని జంటపదాలు ఒక అంశం యొక్క ఇరుపార్శ్వాలను ప్రతిబింబించేవయితే, మరికొన్ని ఆద్యంత సమాహారాన్ని సూచించేవి. ఇంకొన్ని సమర్థక, వ్యతిరేకార్థక సమన్వయ సూచికలు. ‘కష్టసుఖాలు’ జీవితం ఇరు పార్శ్వ ప్రతిబింబకాలు. ‘సూర్యచంద్రులు’ అన్న జంటపదం ఒక రోజు యొక్క ఆద్యంత సమాహారమే. ‘మంచిచెడు’ అనేది సమర్థక వ్యతిరేకార్థక జంటపదమే.
రూపురేఖలు, వేషభాషలు, వేళాపాళా, సిగ్గు ఎగ్గు, కూలీనాలీ, ఇంచుమించు ఇలాంటి జంటపదాలన్నీ విరివిగా వింటూనే వుంటాం. ‘ఇంచుమించు’ అన్న జంటపదంలో ఇంచు అన్నదానికి అల్పత్వము, న్యూనత్వము, ఇంచుకతనము అని అర్థం కాగా, ‘మించు’ అన్నదానికి ఒప్పు, శోభిల్లు, అతిశయించు, తళతళ మెరియు అనే అర్థాలున్నాయి. కానీ ‘ఇంచుమించు’ అని వాడినప్పుడు రమారమి, ఎక్కువ తక్కువగా అనే రూఢ్యర్థంలోనే వాడుతున్నాం. అదీ దీని సొబగు. ఇంచు అన్నదానికి చెఱకు అనే అర్థం కూడా వుండడంవలన చెఱకు విలుకాడు అయిన మన్మధుడిని ఇంచువిల్తుడు అనడమూ వుంది. సరే! అది వేరు సంగతి.
‘చిటపట’లాడాడు, ‘గడబిడ’ చేసాడు ‘చీటికిమాటికి’ గుర్తుచేస్తున్నాడు, ‘పాపపుణ్యాలు’ దేవుడెరుగు, ‘మూటముల్లె’ సర్దుకున్నాడు ‘కట్నకానుకలు’ కోసం ‘కోపతాపాలు’ చూపడం, ‘అవాకులు చెవాకులు’ పలకడం సరికాదు. ఇలా వాక్యాలు జంటపదాలు ఎన్నిటినో ప్రయోగించడం జరుగుతూనే వుంటుంది.
జంటపదాలు విడగొట్టి మొదటి పదానికి అర్థం రెండోపదానికి అర్థం విడివిడిగా చూసుకుంటే కనబడే సొగసులు వేరు. ఒకటిగా ఆ జంటపదం ప్రయుక్తం అయినపుడు ఒక్కోసారి ద్యోతకమయ్యే సొగసు వేరు. శ్రద్ధ్భాక్తులు, భయభక్తులు, ధనధాన్యాలు, ధూపదీపాలు, పేరుప్రతిష్ఠలు, భోగభాగ్యాలు అంటూ ఇలా జంటపదాలు అనేకం వున్నాయి. ఏ రెండుపదాలు పడితే ఆ రెండు పదాలు కలిపేస్తే జంటపదాలు అయిపోతాయనుకుంటే పొరపాటు.
జంటపదాల నిర్మితిలో ఓ సొబగు వుంది. అది భాషలో విలక్షణమైనది, విశిష్టమైనది కూడాను. కూడుగుడ్డ, ఇల్లూ వాకిలి, ఉప్పుపప్పు, ఉలుకు పలుకు, ఇంపుసొంపు, గొడ్డుగోద, చెట్టుచేమ ఇలా జంటపదాలు గురించి ‘చాటుమాటు’ కాక ‘చేదునిజాలు’గానే భాషాసౌందర్యాన్ని ‘తప్పుఒప్పులు’ లేకుండా పట్టుకోవచ్చు.
భాషలోని ఈ జంటపదాల సౌందర్యం కూడా ‘అతీగతీ’ లేకుండా పోయే పరిస్థితి రాకుండా ఇవాళ మనం ప్రసార మాధ్యమాల్లో యాంకరింగ్ అని చెప్పుకునే వ్యాఖ్యానాల్లో సందర్భోచితంగా చేర్చి ప్రయోగిస్తుంటే తెలుగు సౌందర్యం తేజరిల్లడమే కాదు నిజంగా శ్రవణంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతాయి. యాంకర్ విజయానికి ఇవి ‘అండదండలు’గా వుండగలుగుతాయి.
‘ఆదరాబాదరా’ కాకుండా సావకాశంగా జంటపదాలును అధ్యయనం చేసి చూడండి. వాటి ‘బాగోగులు’ అర్థమవడమే కాదు భాషకు అది ఎలాంటి ‘సిరిసంపదలు’ అయి నిలుస్తున్నాయో కూడా తెలుస్తుంది. భాషలోని సొగసు పార్శ్వాన్ని అందివ్వడమే ఇక్కడి వంతు. అల్లుకుపోవడం భాషాభిమానులైన అందరి తంతు. ఏమంటారు.
నుడి(3.3.2012)
Labels:
భాషలో సొగసులు
Saturday, February 25, 2012
మృతం కాదు అమృతం
ఆంధ్రభూమి దినపత్రిక
'నుడి ' పేజీ లో
ఈ శనివారం నుండి మొదలైన నా శీర్షిక.
కొద్దివారాల పాటు సాగే ఈ శీర్షిక చదివి
మీ స్పందన తెలియ చేస్తారుగా!
మృతం కాదు అమృతం
భాష భావవినిమయ సాధనం.
భావ వ్యక్తీకరణ చేయడానికి- ఇంకొకరితో మాట్లాడటానికి భాషను ప్రయుక్తం చేస్తాం. అలాగే రాయడానికీ భాషను వినియోగిస్తాం. మాట్లాడినప్పుడు మాట. రాసినప్పుడు లిపి.
మాట్లాడే భాషకూ, రాసే భాషకూ ఒకప్పుడు అంతరం వుండేది. గ్రంథస్థమైన భాషను గ్రాంథికం అనీ, వ్యవహరించే భాషను వ్యావహారికం అనీ అన్నారు. కానీ రాను రాను మాట్లాడినట్లే రాయాలనీ, అందువల్ల రాసింది చదివినప్పుడు, మాట్లాడినట్లే అనిపించి, నిజమైన భావ వినిమయం సరళంగా, సూటిగా జరుగుతుందనీ ఒక ఉద్యమంలానూ జరిగింది. కానీ ఇప్పటికీ మాట్లాడ్డానికీ రాయడానికీ మధ్య భాషను ప్రయుక్తం చేయడంలో అనివార్యంగా కొంత అంతరం వుంది.
ఒకమాట అని, నేను అనలేదని ఆ తరువాత మాటలతోనే త్రోసిరాజనవచ్చు. కానీ అదే రాసినప్పుడు లిఖితరూపంగా వుండి, వ్యక్తీకరించిన విషయం తిరుగులేనిదిగా నమోదవుతుంది. అందుకే ‘అక్షరం’ అంటే క్షరము కానిది, నశించనిది అని అర్థం మరి! అందుకనే లిఖిత పూర్వకవిషయాలకు వుండే విలువ, ‘మన్నిక కాలం’ ఎక్కువ.
ఒక విషయం ప్రభావవంతంగా మాట్లాడానికి కూడా అందువల్లనే ముందు చెప్పదలుచుకున్న దానిని వ్రాతపూర్వకంగా కూర్చుకోవడం జరుగుతుంది.
ఇంతకీ మాట్లాడినా, రాసినా అదే తెలుగు, అదే వర్ణమాలలోని అక్షరాలనే అందరూ ఉపయోగిస్తున్నా కొందరు మాట్లాడే మాటలు ఎంతో శ్రవణానందకరంగానూ, అలాగే కొందరి రచనలు పఠితలకు ఎంతగానో ఆసక్తిదాయకాలూ కావడానికి హేతువు భాషలోని వ్యక్తీకరణే!
సాహిత్యం ‘ఆలోచనామృతం’ అన్నారు. అది మౌఖికమైనా, అక్షరబద్ధమయినా అట్టిదిగానే రాణించాలి. తెలుగు భాషలో సహజంగానే ఎంతోగొప్ప పదసంపద వుంది. ముఖ్యంగా భాష సజీవంగా నిలవడానికి, మనుషుల మధ్య నిరంతరంగా అది వినిమయమవుతూండాలి. అన్యభాషలు నేర్చినా మాతృభాషను పరిపుష్టం చేసుకోవాలే కానీ- విస్మరించకూడదు. వ్యక్తీకరణకు అనుకూలంగా, కాలావసరాలకు తగినట్లుగా భాషను పెంపు చేసుకుంటూండాలి. కొత్త పద సృష్టి స్వభాషలో జరుపుకోకుండా, పాతబడిన మాటలంటూ వున్నదానిని కూడా పోగొగట్టుకోవడం విజ్ఞత కాజాలదు!
భావ వ్యక్తీకరణ చేయడానికి- ఇంకొకరితో మాట్లాడటానికి భాషను ప్రయుక్తం చేస్తాం. అలాగే రాయడానికీ భాషను వినియోగిస్తాం. మాట్లాడినప్పుడు మాట. రాసినప్పుడు లిపి.
మాట్లాడే భాషకూ, రాసే భాషకూ ఒకప్పుడు అంతరం వుండేది. గ్రంథస్థమైన భాషను గ్రాంథికం అనీ, వ్యవహరించే భాషను వ్యావహారికం అనీ అన్నారు. కానీ రాను రాను మాట్లాడినట్లే రాయాలనీ, అందువల్ల రాసింది చదివినప్పుడు, మాట్లాడినట్లే అనిపించి, నిజమైన భావ వినిమయం సరళంగా, సూటిగా జరుగుతుందనీ ఒక ఉద్యమంలానూ జరిగింది. కానీ ఇప్పటికీ మాట్లాడ్డానికీ రాయడానికీ మధ్య భాషను ప్రయుక్తం చేయడంలో అనివార్యంగా కొంత అంతరం వుంది.
ఒకమాట అని, నేను అనలేదని ఆ తరువాత మాటలతోనే త్రోసిరాజనవచ్చు. కానీ అదే రాసినప్పుడు లిఖితరూపంగా వుండి, వ్యక్తీకరించిన విషయం తిరుగులేనిదిగా నమోదవుతుంది. అందుకే ‘అక్షరం’ అంటే క్షరము కానిది, నశించనిది అని అర్థం మరి! అందుకనే లిఖిత పూర్వకవిషయాలకు వుండే విలువ, ‘మన్నిక కాలం’ ఎక్కువ.
ఒక విషయం ప్రభావవంతంగా మాట్లాడానికి కూడా అందువల్లనే ముందు చెప్పదలుచుకున్న దానిని వ్రాతపూర్వకంగా కూర్చుకోవడం జరుగుతుంది.
ఇంతకీ మాట్లాడినా, రాసినా అదే తెలుగు, అదే వర్ణమాలలోని అక్షరాలనే అందరూ ఉపయోగిస్తున్నా కొందరు మాట్లాడే మాటలు ఎంతో శ్రవణానందకరంగానూ, అలాగే కొందరి రచనలు పఠితలకు ఎంతగానో ఆసక్తిదాయకాలూ కావడానికి హేతువు భాషలోని వ్యక్తీకరణే!
సాహిత్యం ‘ఆలోచనామృతం’ అన్నారు. అది మౌఖికమైనా, అక్షరబద్ధమయినా అట్టిదిగానే రాణించాలి. తెలుగు భాషలో సహజంగానే ఎంతోగొప్ప పదసంపద వుంది. ముఖ్యంగా భాష సజీవంగా నిలవడానికి, మనుషుల మధ్య నిరంతరంగా అది వినిమయమవుతూండాలి. అన్యభాషలు నేర్చినా మాతృభాషను పరిపుష్టం చేసుకోవాలే కానీ- విస్మరించకూడదు. వ్యక్తీకరణకు అనుకూలంగా, కాలావసరాలకు తగినట్లుగా భాషను పెంపు చేసుకుంటూండాలి. కొత్త పద సృష్టి స్వభాషలో జరుపుకోకుండా, పాతబడిన మాటలంటూ వున్నదానిని కూడా పోగొగట్టుకోవడం విజ్ఞత కాజాలదు!
భావ వ్యక్తీకరణకు సమర్థం కాకుండా భాషను పడగొట్టుకున్నా, అధునాతన శాస్త్ర సాంకేతిక ప్రగతికి అనుగుణంగా తగిన పద సంపద కూర్చుకుని భాషను విస్తరించుకున్నా అది మనం చేసుకునేదే!
మన తెలుగు భాషలో ఎంతో మాధుర్యం వుంది. తొంభై సంవత్సరాల క్రితం 1921లో పానుగంటివారు ‘స్వభాష’ అనే సాక్షి వ్యాసంలో పేర్కొన్నట్లు - ‘‘మన భాషయే- మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే- మహానంద కందళ సందోహ సంధాన తుందిలమగు మాతృభాషయే- క్రమతకు క్రమత, కఠినతకు కఠినత, వదలునకు వదలు, బిగికి బిగి, జోరునకు జోరు, ఎదురెక్కునకెదురెక్కు, మందతకు మందత- ధాటికి ధాటియూ- నన్నివనె్నలు, నన్నిచినె్నలు, నన్నివగలు, నన్నివద్దికలు, నన్నితళుకులు, నన్నిబెళుకులు, నన్నిహొయలు, నన్నిమొయ్యారములు కలిగిన మన మాతృభాషయే. వ్యాసమునకు, ఉపన్యాసమునకు కవిత్వమునకు గానమునకును సంపూర్ణార్హత కలిగిన భాషయే పైవారే యా భాషను పట్టుదలతో ప్రయత్నమున నభ్యసింపవలసియుండగా మనవారే దానినంత యధమాధమముగా చూచుట తగునా’’ అన్న ఆర్తి నేడు మరీ ఔచితీమంతం!
తెలుగు భాషలో బోలెడు సొగసులున్నాయి. తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు మొదలుకొని నేడు ఆంగ్లాది అన్య భాషా పదాలను సైతం భావ వ్యక్తీకరణానుకూలంగానే ‘తెలుగు’ తనలో కలుపుకుంది. అయితే నేడు తెలుగు భాష అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే స్థితి పొడచూపుతోంది అంటే అందుకు కారణం మన భాష సమర్థతను, మన భాషలోని సొగసులను మనమే గుర్తించక, వినియోగంలో స్వయంగా చేజార్చుకుంటూ వుండడమే.
మాట్లాడడానికయినా, రాయడానికయినా తెలుగు భాషమీద పట్టు కావాలి. అది పట్టుకునే పట్టుదల కావాలి. భాషలోని సొగసులను గ్రహించి, అందిపుచ్చుకుని, నిత్య వ్యవహారంలో, లేఖనంలో, నిలుపుకోవాలి. తెలుగు మృతభాష కాదు- అమృతభాష. ‘‘తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతూనే వుంటాయి’’ అని ఆరుద్ర అన్నట్లు మన తెలుగు భాషలో సొగసులు సతత హరితాలు. సదా అవధరణీయాలు.
భాషలో మౌలికంగా వున్న అలాంటి కొన్ని సొగసులను విస్మృతిలోకి పోకుండా ‘స్మర వారంవారం’ అంటూ మళ్ళీ మళ్ళీ తలుచుకుందాం. ఉన్న సంగతులనే ఈ తరానికి పెన్నిధులుగా అందించుకోవాల్సిన అవసరం వుంది కనుక, తెలుగుభాషా వికాసం మన తెలుగువారందరి కర్తవ్యం కనుక, మన భాషలోని సొగసులను కొన్ని ఉపయుక్తం చేసుకునేందుకు పునశ్చరణలోకి తెచ్చుకుందాం. తెలియని సంగతులని కాదు గానీ, తెలిసిన సంగతులనే మళ్ళీ ఓ మారు మాటల్లో కలబోసుకుందాం. ముందుగా వచ్చేవారం భాషలో సొగసుగా వున్న ‘జంటపదాలు’ అనే అంశం మాటాడుకుందాం.
Labels:
భాషలో సొగసులు
Subscribe to:
Posts (Atom)