శ్రీమతి శారదా అశోకవర్థన్
తెలుగు పాఠకులకు,శ్రోతలకు తెలిసిన పేరే ఇది.
కవయిత్రిగా,కథా,నవలా రచయిత్రిగా,నాటక కర్తగా,
వ్యాఖాత్రి గా
బాల సాహిత్యవేత్తగా
పేరొందిన వారామె.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాచార శాఖలో
పనిచేస్తూ,కొన్నేళ్ళు ఆకాశవాణి హైదరాబాద్
కుటుంబ సంక్షేమ విభాగంలో పనిచేసారు.
ఆ తరువాత
జవహర్ బాల భవన్ డైరెక్టర్ గా
విశేష ఖ్యాతి పొందారు.
ఇరవైమూడు నవలలు
పన్నెండు కవితా గ్రంథాలు
ఏడు కథా సంపుటులు
ఏడు నాటకాలు
పన్నెండు బాల సాహిత్య గ్రంథాలు రాసిన
శ్రీమతి శారదా అశోక వర్థన్
ఆంధ్రభూమి లో ' శారదాలోచనం' ,' మరమరాలు '
కాలమ్ లు
ఆంధ్రప్రభ బాలల పత్రిక ' చిన్నారి ' కోసం
అయిదేళ్ళకు పైగా
మంచిమాట శీర్షిక నిర్వహించారు.
ముందునుండీ తాను సికింద్రాబాద్ నివాసియే!
ఇటీవలే శ్రీమతి శారదా అశోకవర్థన్
" నా సిరిచుక్క సికింద్రాబాద్ ' అనే గ్రంథాన్ని
సికిందరాబాద్ చరిత్రతో బాటు
తన ఆత్మ కథనాత్మక విషయాలతో రంగరించి
వెలువరించారు.
ఆ పుస్తకానికి
మీ సుధామ ను
ఒక ముందుమాట రాయమని కోరగా
" శారదాధామం సికింద్రాబాద్ " పేరిట రాసిన
మున్నుడి ఇది
0 comments:
Post a Comment