ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, March 21, 2018

ఓ మహిళ జీవన కథనం



S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.



గంటి సుజల ‘అనూరాధ’ వ్రాసిన మాతృసదనం నవల ఒక సాధికారిక మహిళ జీవన కథనం. చిన్నవయసులోనే ‘మాస్టర్ చెఫ్’ పోటీలో విజేతగా నిలిచిన అమ్మాయి కథ. ఆ అమ్మాయి మామూలు అమ్మాయి, అందమైన కుటుంబ నేపథ్యం వున్న స్త్రీ కూడా కాదు. ఆమె వెనుక వున్న జీవితం ఒక దారుణ బాధామయ గాథ. ఆమె తల్లి మానసికంగా ఎదగని శాపగ్రస్త. అంతేకాదు అరాచకానికి గురై తల్లి అయి బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి తల్లికి పుట్టిన బిడ్డ సమాజంలో ఎదగడమంటే మాటల! తన కన్నీళ్లను, కడగండ్లను అధిగమించి, శక్తిసామర్థ్యాలతో ఎదిగిన ఆ అమ్మాయి ప్రణతి. తల్లి ‘రోజా’ పిచ్చిపిల్ల అయినా, ఆ పిచ్చిపిల్లకు పిల్లగా, ఆంటీ ప్రసూన అండతో ప్రణతి - కోటిరూపాయల బహుమతిని గోల్డెన్ చెఫ్ కోట్‌తో - అందుకునే స్థాయికి ఎలా ఎదిగిందీ, ఈ నవల ఉత్కంఠభరితంగా చదివిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు సాధించలేనిది లేదని నిరూపిస్తుంది.

అమిత్‌ను ప్రేమించి మోసపోయిన ప్రసన్న అబార్షన్ చేయించుకుని తనదైన జీవన మార్గాన్ని వేసుకోవడం, ప్రణతికి ఆంటీగా స్ఫూర్తిదాయకం కావడం కూడా ఒక విశేషం.
 నవలలోని పాత్రలన్నీ జీవితపు అనుభవాల చిత్రికలుగా గోచ రిస్తాయి. మానవులు మృగాలుగా మారి అరాచకాలు చేస్తున్న మానవత్వం ఇంకా నిలచి వుందనే తార్కాణంగా ఇందులోని మహలక్ష్మి చిత్ర, ప్రసన్న పాత్రలను సుజలగారు అద్భుతంగా తీర్చిదిద్దారు.

కొడుకుల స్వార్థపరత్వాన్ని గ్రహించిన మహలక్ష్మి భర్త స్వార్జితమైన ఆస్తిని వారి పరంకాకుండా, తెలివిగా మిత్రురాలు సుభద్ర సహకారంతో అనాధలకు అండగా నిలచే ‘మాతృసదనం’ స్థాపించి ఎందరో పిల్లల ఎదుగుదలకు ఆసరా అవుతుంది. ఆ సదనంలోనే చిత్ర మానసికంగా ఎదగని రోజాని సాకుతుంది. 

ఆడుకోడానికని వాచ్‌మెన్ కళ్లుగప్పి గేట్ దూకి పార్క్‌కు పోయిన రోజా ఆ తర్వాత నాలుగు రోజులకుగానీ దొరకదు. కొన్ని నెలల తరువాత రోజా గర్భవతి అని తెలుస్తుంది. చిత్ర రోజాను దానికి సిద్దం చేస్తుంది మానసికంగా. ఏ కాముకుడి దౌర్జన్యానికి చిహ్నమో తెలియని రోజాకు పుట్టిన పాపాయే ప్రణతి. 

మాతృసదనంలో అకౌంట్స్ చూడడానికి చేరిన వెంకట్రావ్‌గారు కూడా సదనం అభివృద్ధికి తోడ్పడతారు. మహలక్ష్మిగారు మరణించడంతో వారంతా మాతృసదనానికి దూరమైపోతారు. ప్రసన్న రోజాని, ప్రణతిని తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తుంది. ఉద్యోగం చూసుకుని ప్రణతికి చదువు చెప్పిస్తుంది. ప్రసన్న ఇంట్లో లేనప్పుడు తల్లికి సాయం చేయడానికి ఆమె పనుల్లో పాలుపంచుకుంటూ వంటపట్ల ఆసక్తి పెంచుకున్న ప్రణతి అలా కొత్తకొత్త వంటలు చేస్తూ ఎలాగైనా స్వతంత్య్రంగా నిలవాలనే అభిలాషతో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్‌లో దిగుతుంది. తన ఆశయ సాధనలో ఆమె ఎలా ముందుకు వెళ్లిందీ, తల్లి రోజాను ఎలా చూసుకున్నదీ చక్కగా చిత్రించారు రచయిత్రి. తన ఆశయాన్ని సాధించిన ప్రణతి తిరిగి ఎలా అనాధలకు అండగా మళ్లీ మాతృసదనం స్థాపించిందన్నదే నవలకు పరాకాష్ఠ.

అనేక పాత్రలతో, ఘటనలతో నవల అనేక వొంపులు తిరుగుతూ నడుస్తుంది. కథలో కథలుగా అనిపించే ఘట్టాలే అయినా వేటికవి ఓ లక్ష్యంతో ఉదాత్తతతో కానవస్తాయి. ముందు మాటలో పబ్లిషర్ శ్రీమతి జ్యోతి వలబోజు అన్నట్లు ‘ఈ నవల చదువుతుంటే ఏదో సినిమా కథలా, అభూతకల్పనలా అనిపించదు. మన చుట్టూనే జరుగుతున్నట్లుగా ఉంటుంది. కుళ్లు, కుతంత్రం, స్వార్థపరులతోబాటు మంచీ, మర్యాద, ఆప్యాయత, అభిమానాలు ఉన్నవారు కూడా మన మధ్య తప్పకుండా ఉంటారని రచయిత్రి స్పష్టంగా చెప్పారు’
-సుధామ
మాతృసదనం (నవల)
-అనూరాధ (సుజలగంటి)

వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి
303, అలేఖ్య రెయిన్‌డ్రాప్స్
ప్లాట్ నెం.17-18,
గౌతమి ఎన్‌క్లేవ్
కొండాపూర్, హైదరాబాద్-84
ఫోన్:77023 19351
040-40203226

0 comments: