సంతోషమే మానవ జీవిత పరమార్ధమైనప్పుడు
కావాలని దుఃఖపు మడుగుల్లోకి దూకుతున్నావెందుకు
చేయడానికింత పని, ప్రేమించడానికో తోడు
ఆశించడానికో గమ్యం ఇవిచాలదా మనిషికి
అంటారు ‘ముళ్లబాట’ అనే కవితలో.
‘‘శాశ్వత సత్యం మరణమే అని తెలిసినా సత్యానే్వషణ కొనసాగించడం జీవలక్షణం’’ అంటూ తాము కన్న, విన్న, అంతరంగాన తలబోసిన సత్యాలనే జీవన పరమార్ధంగా అభివ్యక్తీకరించారు వీటిల్లో.
కళ్లెదుట వున్న భువిని స్వర్గంగా మలచుకోరా మూర్ఖుడా
కానరాని స్వర్గం కోసం నేలను నరకంగా మారుస్తావెందుకు
అని నిలదీస్తారు.
కాకిలెక్కలు, కారుకూతలు, గందరగోళం, వల్లకాళ్లు, కంకాళాలు, నెత్తురు మరకలు వంటివన్నీ వున్న ఈ సంపుటి ఆయన భావనలో ఆధునికాంతర విచిలిత స్వప్నకవిత్వం. అర్ధశతం పైగా అనేక గ్రంథాలు ఇప్పటికే వెలువరించిన లంకా శివరామప్రసాద్గారు ఈ సరికే కవిగా పాఠక సమాదరణ అందుకున్నారు. ‘మరణశాసనం’ కూడా దానికి అపవాదు కాదు.
-సుధామ
మరణ శాసనం (కవిత్వం)
-డా.లంకా శివరామప్రసాద్
వెల: రూ.100
-సృజనలోకం
ప్రశాంతి హాస్పటల్, శివనగర్, వరంగల్
Akshara 12.12.2015
0 comments:
Post a Comment