ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, August 21, 2011

సముద్రమంత గాయం (పరిచయం)




విషాద బీభత్సాలే వస్తువుగా ద్యోతకమయ్యే యాభై ఒక్క కవితల సంపుటి
కెరె జగదీష్ - ‘సముద్రమంత గాయం’.

రాయలసీమ జీవనం నేపథ్యంగా గల జగదీష్ కవిత్వంలో
బాంబులుకాక భావాల విస్ఫోటనం కానవస్తుంది.






"‘మరణంలో రణం అంతర్ముఖమైనప్పుడు

నీ మరణం

రణరంగానికి బీజం కావాలి’"


అని పేర్కొంటూనే- శాంతినారాయణ మిత్రుడు కనుక ,శాంతి గురించి నారాయణ మంత్రంలా, పలు కవితల్లో పదే పదే జపిస్తాడు కూడా.

"నా ప్రతి శ్వాసా కవిత్వమై

జీవితమంతా కవిత్వంలో జీవిస్తాను

అగాధ లోయల్లోకి జారినా

వెంటపడిన కవితా స్పర్శ

ఊయల లూగిస్తుంది

నా మస్తిష్కంతో కవితాక్షరాలు

కనుమరుగయితే

జీవన శ్వాస ఆగి మరణిస్తాను."


-అంటూ కవిత్వమే బ్రతుకుగా సంభావిస్తాడు.

తన మాతృభాష తెలుగుకాక కన్నడమే అయినా జర్నలిజం వృత్తిగా, కవిత్వమే ప్రవృత్తిగా చేసుకుని తెలుగు కన్నడాల సంస్కృతీ సమ్మేళనంతో కూడిన అంతరంగంనుండి అభివ్యక్తమయిన ఈ భావాలు తొలి సంపుటే అయినా మరీ తొలకరిగా లేవు.

కాలం కఠోర పరీక్షలకు గాయపడుతున్న ప్రతి సందర్భాన్నీ, మనిషినీ ,తన కవిత్వలేపనంతో సేదతీరుస్తున్న కవి.


(ప్రతులకు: కెర్ అండ్ కెర్ కంప్యూటర్స్, 10-2-219 (21) చర్చిరోడ్, రాయదుర్గం (పోస్టు), అనంతపురం, 515865, వెల: రూ.100/-)

0 comments: